ఆంధ్రుల ఆరాధ్యదైవంగా, ఆఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ ఎప్పటికీ గూడుకట్టుకున్న అభిమాన నటుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని స్థాపించి.. దేశరాజకీయాలలో పెను ప్రకంపనలు సృస్టించిన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారాక రామారావు 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబీకులు నివాళులర్పించారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళుర్పించి, ఆయన సేవలను గుర్తు చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరిచిపోరన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని, మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని, బడుగు బలహీన వర్గాలు, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో 610 జీవోను తీసుకొచ్చింది ఎన్టీఆరేన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610 జీవోలు అమలు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నివాళులు అర్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. కోవిడ్ బారిన పడిన కారణంగా ఆయన స్వియ నిర్భంథంలో ఉంటూనే ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మార్గదర్శకంలోనే కార్యకర్తలు, ప్రజలు నడవాలని ఆయన కోరారు. టీడీపీ స్థాపనతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటారని ఆయన కొనియాడారు. కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రాని జూనియర్ ఎన్టీఆర్.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
'తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ... ధ్రువతార మీరే' అని తారక్ ట్వీట్ చేశాడు. తన తాత ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, నందమూరి సుహాసిని, లక్ష్మీపార్వతి తదితరులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లోని సమాధి వద్ద నివాళులు అర్పించిన అమె.. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more