ఆంధ్రుల ఆరాధ్యదైవంగా, ఆఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ ఎప్పటికీ గూడుకట్టుకున్న అభిమాన నటుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని స్థాపించి.. దేశరాజకీయాలలో పెను ప్రకంపనలు సృస్టించిన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారాక రామారావు 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబీకులు నివాళులర్పించారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళుర్పించి, ఆయన సేవలను గుర్తు చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరిచిపోరన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని, మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని, బడుగు బలహీన వర్గాలు, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో 610 జీవోను తీసుకొచ్చింది ఎన్టీఆరేన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610 జీవోలు అమలు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నివాళులు అర్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. కోవిడ్ బారిన పడిన కారణంగా ఆయన స్వియ నిర్భంథంలో ఉంటూనే ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మార్గదర్శకంలోనే కార్యకర్తలు, ప్రజలు నడవాలని ఆయన కోరారు. టీడీపీ స్థాపనతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటారని ఆయన కొనియాడారు. కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రాని జూనియర్ ఎన్టీఆర్.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
'తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ... ధ్రువతార మీరే' అని తారక్ ట్వీట్ చేశాడు. తన తాత ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, నందమూరి సుహాసిని, లక్ష్మీపార్వతి తదితరులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లోని సమాధి వద్ద నివాళులు అర్పించిన అమె.. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more