మావోయిస్టు పార్టీలో మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బలతో పార్టీ ఉనికికే ప్రమాదం సంభవిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల నుంచి చత్తీస్ గడ్ రాష్ట్రంలోని వలసవెళ్లి కదలికలను పూర్తిగఆ రాష్టానికే పరిమితం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో సరిహద్దుల నుంచి తెలంగాణలోకి వస్తున్న మావోయిస్టులకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఇటీవల తెలంగాణలోకి వచ్చి మాజీ సర్పంచ్ భర్తను హతమార్చిన మావోలకు గట్టి ఎదురుదెబ్బ ఇవాలని ఎదురుచూస్తున్న పోలీసులు.. ఇవాళ వెకువ జామున జరిగిన ఎన్ కౌంటర్ తో బదులు తీర్చుకున్నారు. తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోలను పోలీసులు హతమార్చారు.
ములుగు జిల్లాలోని నుంగూరు మండలపరిధిలోని వెంకటాపురంలో ఛత్తీష్గఢ్ సరిహద్దుకు సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలైట్ యాంటీ నక్సల్ స్క్వాడ్ గ్రేహౌండ్స్కు చెందిన ఒక కానిస్టేబుల్ గాయపడ్డారని పోలీసువర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ స్థలం నుండి మావోలకు చెందిన అదునాతన రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు డివిజన్ స్థాయి నాయకులు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపత్ రావ్ పాటిల్ ఈ ఎదురుకాల్పుల విషయమై సందిస్తూ.. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం ఇంకా అందలేదని చెప్పారు. ‘‘ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ ఆయా ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయిని, అందుకని వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని అన్నారు. మావోల కోసం కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు. అయితే ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టులు ఎవరన్న విషయాలతో కూడిన సమాచారాన్ని తరువాత ప్రకటిస్తామని గణపత్ రావ్ పాటిల్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more