COVID-19 Cases might peak in late Jan: epidemiologist Bhramar Mukherjee ‘జనవరిలో తారాస్థాయికి ఒమిక్రాన్.. ఫిబ్రవరిలో తగ్గుముఖం’

Covid cases in india may peak by january end subside by feb epidemiologist bhramar mukherjee

Dr. Bhramar Mukherjee, epidemiologist, University of Michigan, Covid cases india, covid omicron india news, covid third wave peak india news, third wave india peak when news, omicron cases india

Data scientist and epidemiologist at University of Michigan Professor Bhramar Mukherjee has said that India is likely to witness a peak in coronavirus cases in late January. She also mentioned that states like Delhi, Maharashtra and West Bengal, which have seen a peak in coronavirus cases in the early part of January, may witness a slowdown of the growth trajectory. I am hopeful some of the states are going to peak in the next seven days.

జనవరిలో తారాస్థాయికి ఒమిక్రాన్.. ఫిబ్రవరిలో తగ్గుముఖం: శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ

Posted: 01/13/2022 01:18 PM IST
Covid cases in india may peak by january end subside by feb epidemiologist bhramar mukherjee

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు ఐదువేలకుపైగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ఇప్పటికే అమెరికా, బ్రిటెన్, దక్షిణాప్రికా దేశాల్లో లక్షలాధి మందిని ప్రభావితం చేసింది. ఇక భారత్ లోనూ ఇది ప్రభావం చాటుతోంది. అయితే దీని బారినపడ్డ వారిలో చాలా తక్కువ మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా మందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఏమాత్రం కనిపంచడం లేదు. ఈ క్రమంలో ఒమిక్రాన్ ఉవ్వెత్తున లేచినా అంతే వేగంగా తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు పేర్కోంటున్నారు.

కరోనా ఒమిక్రాన్ వైరస్ కేసులు భారత్ లో జనవరి చివరికి తారస్థాయికి చేరి, ఫిబ్రవరిలో తగ్గుముఖం పడతాయని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్, మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ముందుగానే కేసులు గరిష్ఠాలకు చేరి తగ్గుతాయని అంచనా వేశారు. ఈ రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల్లోనే కేసులు పతాకస్థాయికి చేరతాయన్నారు. ఢిల్లీలో పునరుత్పత్తి రేటు 2 శాతం వరకు వెళ్లి (ఒకరి నుంచి ఇద్దరికి సోకడం) 1.4 శాతానికి తగ్గినట్టు ముఖర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వచ్చే వారంలోనే కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠాలకు చేరతాయని, దేశవ్యాప్తంగా జనవరి చివరికి తారస్థాయికి చేరి, అనంతరం తగ్గిపోతాయని ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉందని.. కార్చిచ్చులా వ్యాపిస్తోందని.. అలాగే అదే రీతిలో తగ్గుముఖం కూడా పడతుందని.. ఇది ఎక్కువ రోజుల పాటు కొనసాగబోదని తన విశ్లేషణను ముఖర్జీ వివరించారు. కేసులు ఎక్కువగా వచ్చినా, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికి దేవుడి అనుగ్రహం, టీకాలు ఇవ్వడం, ప్రజారోగ్య చర్యలు దోహదపడి ఉండొచ్చన్నారు. భారత్ లో సహజ రోగనిరోధకతకు తోడు టీకాలు ఇవ్వడం మేలు చేసిందన్నారు. ఇతర దేశాల్లో కేసులు భారీగా ఉండడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి టీకాలు తగినంత తీసుకోకపోవడమే కారణమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles