ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో దోషిగా నిర్థారించబడినట్టు కోర్టు తీర్పును వినగానే సోమ్మసిల్లి కిందపడ్డారు. సృహతప్పిన ఆయనను వెంటనే న్యాయస్థాన సిబ్బంది నీళ్లు చల్లి లేపారు. ఎవార మంత్రి అంటారా.? ఆయనే షాద్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యుడు పి.శంకర్రావు. ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో ఆయన రెండు కేసులలో దోషిగా తేలారు. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంలో పాటు మరో కేసులో ఓ గృహిణిపై దాడి చేయడంతో పాటు వారి ఇంట్లోకి దౌర్జన్యంగా చోరబడి రభస చేసినట్లు తేలింది. కాగా మరో కేసులో ఆయనపై నేరారోపణలు రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో న్యాయస్థానం అయనను నిర్ధోషిగా ప్రకటించింది.
అయితే, భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్రావును కోర్టు దోషిగా తేల్చింది. మహిళను దూషించిన కేసులో రూ. 2,000, మరో కేసులో రూ. 1,500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్తో స్పృహ తప్పి పడిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. షాదనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరేండ్ల క్రితం శంకర్రావు ఓ భూ వివాదంలో జోక్యం చేసుకొని పలువురిని బెరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి మహిళను బెదిరించారని కూడా ఆయనపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.
వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ తీర్పు చెప్పారు. శంకర్రావుకు మొదట కోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించింది. అయితే, న్యాయమూర్తి తీర్పు చదువుతున్న సమయంలో కోర్టు హాల్లోనే శంకర్రావు వీల్చైర్లో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శిక్షను రద్దుచేసి ఓ కేసులో రూ.2,000, మరో కేసులో రూ.1,500 జరిమానా విధించిది. మూడో కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేశారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. శంకర్రావు పై కోర్టులో అప్పీల్ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more