సామాన్యులు, పేదలను తక్కువ ధరలో సుదూర ప్రయాణాలు అందించే రైలు మార్గం కూడా ఇక మరింత ప్రియం కానుంది. కరోనా కష్టకాలం నుంచి రైలు ప్రయాణాలలో ఇదివరకు అందించిన సబ్సీడీలను పునరుద్దరించని రైల్వే శాఖ.. మూలిగే నక్కపై తాటికాయ వేసినట్లుగా రైలు ప్రయాణికులపై మరింత అదనపు భారం మోసేందుకు సిద్దమయ్యింది. కరోనా అనంతరం పున:ప్రారంభమైన రైళ్లలో అన్ రిజర్వు క్లాస్ కూడా రిజర్వుడ్ క్లాస్ గా మారింది. దీంతో పేదల సుదూర ప్రయాణాలకు కళ్లెం పడింది. రెక్కాడితే కాని డొక్కాడని జీవులపై కూడా రైలు ప్రయాణభారాన్ని మోపిన రైల్వేశాఖ ఇక తాజాగా మరో వడ్డనకు సిద్దమైంది.
ఓ వైపు కేంద్రం రైల్వే బడ్జెట్ ను ఎత్తేసి.. ఒకే బడ్జెట్ విధానాన్ని అవలంభించడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయా.? అన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే అవగతం అవతున్నాయి. టికెట్ల ధరలను అమాంతం పెంచేసి.. ఓ వైపు సబ్సడీ విధానాన్ని ఎత్తేసి.. మరోవైపు భారాన్ని పెంచుతూ.. ఇంకోవైపు రైళ్లను ప్రైవేటీకరిస్తూ.. ఇది చాలదన్నట్లు పండుగ వేళ్లలో ప్లాట్ ఫామ్ టికెట్లు పెంచుతూ.. అన్ లైన్ టికెటింగ్ కు ఇంటర్నెట్ చార్జీలు వసూళ్లు చేస్తూ.. కేవలం వ్యాపార ధోరణి అవలంభిస్తూ.. రైలు ప్రయాణాల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక తాజాగా మరో అదనపు చార్జీలను ప్రయాణికులపై వడ్డించేందుకు రెడీ అవుతున్నారు.
అదేంటంటే.. కొత్తగా స్టేషన్ల డెవలప్ మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) లేదా యూజర్ ఫీజు రూపంలో రుసుములను రైల్వే శాఖ వసూలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను అత్యాధునిక వసతులతో, విమానాశ్రయాలను తలపించే మాదిరిగా రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. ఈ పనుల కాంట్రాక్టులను ప్రైవేట్ సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్నింటి అభివృద్ధి పూర్తి కాగా, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ల నుంచి రైలు ఎక్కి వెళ్లే వారు.. అలాగే ఈ స్టేషన్లలో రైలు దిగే వారి నుంచి ఎస్డీఎఫ్ ను రైల్వే శాఖ వసూలు చేయనుంది. రూ.10 నుంచి రూ.50 వరకు ఈ చార్జీ పడనుంది.
టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఈ చార్జీ సైతం కలసిపోతుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపి నోటిఫై చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాల్లోనూ యూజర్ ఫీజును టికెట్ చార్జీలో బాగంగా వసూలు చేస్తున్నారు. అన్ని రకాల ఏసీ టికెట్లపై రూ.50, స్లీపర్ టికెట్ లపై రూ.25, అన్ రిజర్వ్ డ్ టికెట్లపై రూ.10 గా ఈ చార్జీ ఉంటుంది. సబర్బన్ రైలు సర్వీసులపై ఈ చార్జీ ఉండదు. అంతేకాదు ఇలా అభివృద్ధికి నోచుకున్న స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను కూడా రూ.10 పెంచనున్నారు. ఈ రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్టేషన్ల అభివృద్ధి, నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు సంస్థలు, రైల్వే పంచుకుంటాయి. ముందుగా 50 స్టేషన్లలో ఈ చార్జీలను అమల్లోకి తీసుకురానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇలా అభివృద్ధికి నోచుకుంటున్న రైల్వే స్టేషన్లు ఏపీలో 21, తెలంగాణలో 8 ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more