యదాద్రి భువనగిరి జిల్లాలో ఓ రైతుకు గుప్త నిధి లభించగా, దానిని పోలీసులకు అందించాడు. తన సోదరుడితో ఉన్న విభేదాల కారణంగా దానిని ఆయనతో పంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేయని రైతు నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి వాటిని అప్పగించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు స్థానిక రెవెన్యూఅధికారులకు వాటిని అప్పగించారు. అయితే ఈ నిధులలో బంగారు, వెండి నాణేలతో పాటు బంగారు ఆభరణాలను కూడా ఉన్నాయి. గుప్త నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
యాదాధ్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం కుంకుడుపాముల గ్రామానికి చెందిన రైతు కన్నబోయిన మల్లయ్య పోలంలో పనిచేస్తున్న కొందరు కూలీలు మడిని చదను చేస్తుండగా, ఓ చోట ఇనుప పెట్ట లభించింది. దాని పక్కనే ఓ మట్టి కుండ కూడా లభ్యమైంది. అందులో ఏమున్నాయన్న కూడా తెలియిన కూలీలు రైతు మల్లయ్యకు దానిని అప్పగించారు. దానిని తెరచి చూసిన మల్లయ్య ముఖంలో ఆశ్చర్యం.. ఆ వెంటనే ఆనందం కనిపించాయి. అందులో గుప్తనిధులు లభించాయి. బంగారు, వెండి నాణేలాతో పాటు బంగారు ఆభరణాలు కూడా లభించాయి. రైతు ముఖం కూడా బంగారంలా మెరిసింది. అయితే ఆ మెరుపులు కొద్దిసేపు మాత్రమే నిలిచాయి.
కూలీల ద్వారా విషయం తెలుసుకున్న మల్లయ్య తమ్మడు లింగయ్య.. అన్నకు లభించిన గుప్త నిధులలో వాటా కావాలని కోరాడు. దీంతో ఇద్దరు మధ్య పేచీ పెద్దగానే అయ్యింది. చివరకు ఓ గ్రామ పెద్ద వద్ద పంచాయితీ నిర్వహించి అన్నదమ్ములిద్దరూ దానిని సమానంగా పంచుకోవాలని నిర్ణయించారు. అయితే తమ్ముడితో వాటాను పంచుకోవడం ఇష్టంలేని మల్లయ్య నేరుగా గుప్తనిధిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. వారు రెవెన్యూ అధికారులను సమాచారం అందించగా.. వారు వచ్చి గుప్తనిధిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. నాణేలపై ఉర్దూలో రాసివుందని.. అయితే ఇవి ఏ కాలానికి చెందినవో తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు వాటిని పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more