రోజురోజుకూ తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో నమోదువుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ మధ్యనెల నుంచి ఆకస్మికంగా పెరిగిన చలితీవ్రంగా రాత్రివేళ్లలో మాత్రం పంజా విసురుతోంది. గత పది రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోగా.. ఆ తరువాత గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యాయి. కాగా గత మూడురోజులుగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. అంతేకాదు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా నమోదవుతున్నాయి. ఇటీవల 14 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.. రెండు మూడు రోజులుగా తగ్గుతూ బుధవారం 11.4 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సోసైటీ సహా పలు ప్రవైటు వాతావరణ సంస్థలు, బ్లాగులు ఇక తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని పేర్కోన్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపుగా 14 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. అయితే చల్లగాలులకు ఉపరితల ద్రోణి కారణంగా పేర్కోన్నారు. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో చలి తవ్రత పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం వడగండ్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో మధ్యాహ్నం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో సాయంత్రం వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాలో రాత్రి 7 గంటల ప్రాంతంలో బోధన్, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా, బోధన్, డిచ్పల్లి మండలాలతోపాటు నిజామాబాద్లోనూ వాన కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్ల వాన పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more