పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య జనానికి ఇప్పుడు ఇంకో చేదువార్త. మరి కోన్ని గంటల్లో కొత్త ఏడాదిని ఆస్వాదిద్దామని.. వచ్చే ఏడాదైనా తమకు కలసి వస్తుందని సామాన్యులు భావిస్తున్న తరుణంలో.. న్యూఇయర్ వాయింపులకు కేంద్రం సిద్దమైంది. సాధారణంగా ఇలాంటి వాయింపులను ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించి.. ఆ తరువాత నూతన అర్థిక సంవత్సరం నుంచి అమలు పర్చే విధానానికి కూడా స్వస్తి పలికిన కేంద్రం.. తాము అనుకున్నదే తడవుగా వాయింపులకు మాత్రం న్యూఇయర్ ను ఎంపిక చేసుకుంది.
అదేంటి అర్థరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్న ఈ క్రమంలో దేశవ్యాప్తంగా యాఫ్ ఆధారిత ఆటోలను ప్రయాణాలపై అదనపు చార్జీలు పడనున్నాయి. అటోవాలాలు తమకు డీజిల్ ధర పెరింగిందని ధరలు పెంచేందుకు అనుమతించాలని ధర్నాలు చేసే రోజులు పోయి.. ఏకంగా ప్రభుత్వమే తమకు జీఎస్టీ ఇవ్వాలని అటో ప్రయాణికులపై భారాన్ని మోపుతున్నాయి. దీంతో ఇకపై ఆటో ప్రయాణాలు కూడా మరింత ప్రియం కాబోతున్నాయి. అంటే కొత్త సంవత్సరం రాకతో ఆటో ప్రయాణానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఓలా, ఉబర్ వంటి రైడ్ షేరింగ్ యాప్లలో ఆటో బుక్ చేసుకుంటే కనుక ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ర్యాపిడో నుంచి బైక్ బుక్ చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. బుక్ చేసుకునే సమయంలోనే జీఎస్టీ 5 శాతం కలిపేసి ధరను నిర్ణయిస్తారు. అయితే, ఆన్లైన్లో కాకుండా బయట ఆటోను బుక్ చేసుకుంటే మాత్రం ఈ జీఎస్టీ వర్తించదు. కాబట్టి ఇది కొంత ఊరటనిచ్చే విషయమే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 4 లక్షల మందిపై భారం పడనుంది. నగరంలో 38 వేల ఆటోలు ఓలా, ఉబర్ నుంచి బుకింగులు స్వీకరిస్తున్నాయి.
అలాగే, ఒక్కో ఆటో రోజుకు 20 నుంచి 25 ట్రిప్పులు వేస్తుంటాయి. ఇవన్నీ కలుపుకుంటే రోజూ 8 లక్షలకు పైగా రైడ్లు అవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల భారం పడుతుంది. నిజానికి మధ్య తరగతి ప్రజలు కారు కంటే ఆటో ప్రయాణానికే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. కారుతో పోలిస్తే ఆటో ధర తక్కువ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆటో రైడ్పై జీఎస్టీ విధించడం వల్ల వీరందరిపైనా భారం పడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more