కొత్త రూపం దాల్చుకుని వచ్చిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ మన దేశ రాజధాని ఢిల్లీలోనూ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 331 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ అమలు చేస్తోంది. కఠిన ఆంక్షలు విధిస్తూ.. కరోనా తొలి దశ అన్ లాక్ సమయంలో తొలినాళ్లతో తీసుకున్న సరి-బేసి సంఖ్య అధారంగా వ్యాపారాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియా సమావేశంలో ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా వుంటోందని అందువల్ల ఎల్లో అలర్ట్ ప్రకటించామని అన్నారు. కోవిడ్ నిబంధనలు ప్రజలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. మాస్క్ ధరించడం.. బౌతికదూరం పాటించడం.. తప్పనిసరని సూచించారు. కాగా, కేసులు పెరుగుతున్నా.. బాధితులు వ్యాది తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల అవసరం కూడా పెరగలేదన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మునుపటి అనుభవాల రిత్యా పది రెట్లు ఎక్కువగానే తాము సిద్దంగా వున్నామని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 331 కొత్త కేసులు నమోదుకావడంతో.. జూన్ 9 తర్వాత ఇదే గరిష్టమని తెలిపారు.
ఎల్లో అలర్ట్తో ఢిల్లీలో ఆంక్షలు అమలు
* సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్లు, ఆడిటోరియంలను పూర్తిగా మూసివేస్తారు.
* జిమ్లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్లు మూతబడుతాయి.
* స్కూళ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్లు తెరవడానికి అనుమతి లేదు.
* సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుంది.
* హోటళ్లు తెరుచుకోవచ్చు. అయితే బాంకెట్ హాల్స్, కాన్ఫరెన్స్ హాళ్లను తెరిచేందుకు వీల్లేదు.
* రెస్టారంట్లను 50శాతం సామర్థ్యంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చు. బార్లు 50శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలి.
* దిల్లీ మెట్రో 50శాతం సామర్థ్యంతో నడుస్తుంది. మెట్రోలో నిల్చుని ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు.
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా 50శాతం సామర్థ్యంతో నడపాలి.
* ఆటోలు, టాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
* క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్ను మూసివేయాలి.
* ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది.
* పబ్లిక్ పార్కులు తెరిచే ఉంటాయి.
* అవుట్డోర్ యోగాకు అనుమతి ఉంది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరుచుకోవచ్చు.
* సరి-బేసి పద్ధతిలో మాల్స్, దుకాణాలు తెరవాలి.
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
* పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో 20 మంది మాత్రమే అనుమతి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more