దేశ రాజధానిలో మహిళల బధ్రతపై మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. నిర్భయ తరహా ఘటనలు జరిగిన తరుణంలో ఢిల్లీలో అడుగడుగునా నిఘా పెంచిన పోలీసులు.. ఆ కేసులో దోషులకు శిక్షపడిన తరువాత ఊపిరిపీల్చుకన్నారు. అయితే ఇప్పటికీ దేశరాజధాని ఢిల్లీలో మహిళలపై పలు నేరాలు. ఘోరాలు జరుగుతూనే వున్నాయి. అయితే వాటికి అంతగా ప్రాముఖ్యత, ప్రచారం లభించడం లేదు. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఓ వీడియో.. మహిళల భద్రతపై మరోమారు ప్రశ్నలను లేవనెత్తింది.
ఢిల్లీ పోలీసులు అటు కేంద్రంలోని పెద్దలకు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తూ ఇటు ప్రజలకు కూడా సేవలు అందించే క్రమంలో సామాన్యుల రక్షణపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేని ఘటన జరిగిన సమయంలో ముందస్తు చర్యలు తీసుకునే పోలీసులు అంశం తెరపైకి వస్తుంది. కానీ ఢిల్లీలో మాత్రం అలాంటి పోలీసు వ్యవస్థ ఉందా.? అన్న ప్రశ్నలకు ఈ వీడియో సమాధానంగా నిలుస్తోంది. ఈ వీడియోలో ఓ 21 ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు బైక్ పై పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తున్నారు. అలాగా తమ వాహనాన్ని మలుపు కూడా తిప్పారు. ఎదురుగా ఓ కారు, ఆ వెంటనే ఓ బైక్ వస్తున్న క్రమంలో అమెను వదిలిపెట్టారు.
అంతే అమె ఒక్కసారిగా అలా వచ్చి నడిరోడ్డుపై అగిపోయింది. బైక్ కు పక్కగా వెళ్లిన కారులోని వ్యక్తి అమెను గమనించి కారు అపాడు. ఆ వెనుకే వస్తున్న మరో బైకర్ కూడా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ యువతికి కారు, బైక్ తో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ అమానవీయ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్లో చోటు చేసుకుంది. ఇంతకీ అమెను ఈడ్చుకోచ్చిన ఆ దుండగులు ఎవరు.? ఎందుకిలాంటి అమానుష చర్యకు పాల్పడ్డారు. తన విధులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న అమె.. తన చేతిలోని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తోంది. అంతే అమె వెనకాలే వచ్చిన దుండగులు అమె సెల్ ఫోన్ లాకెళ్లడంతో పాటు ఆమెను బైకుతో ఏకంగా 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు.
అసలేం జరిగిందంటే.. రోడ్డుపై ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చుని ఉంది. ఇదంతా గమనించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఆమె వైపు బైకు నడుపుకుంటూ మహిళ చేతిలోని ఫోన్ని లాక్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన ఆమె వెంటనే బైకుపై ఉన్న ఓ వ్యక్తి చొక్కాను గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ దొంగలు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళను రోడ్డుపై 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఆగంతకులు పారిపోగా , ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
A woman was dragged for around 100 meters by robbers on bike in Shalimar Bagh area of #Delhi on #16December. She is undergoing treatment at a hospital. Even after nine years of #Nirbhaya case nothing has changed interms of #WomenSafety in National capital @DelhiPolice pic.twitter.com/M9anRJLiS0
— Saurabh Trivedi (@saurabh3vedi) December 16, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more