మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేదుచూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ అందెశ్రీ తన కలంతో కాకుండా ఇప్పటితరం మనుషులను చూసి గుండెతో తన అవేదనను వ్యక్తం చేసిన పాట ఇది. పూర్వం ఇంట్లో వండుకున్న అన్నమైనా అతిధికి పెట్టకుండా తినేవారు కాదు. అలాంటిది.. ఈ రోజుల్లో అన్నమో రామచంద్రా అంటూ ఆర్తానాదాలు పెడుతూ.. వీదుల వెంబడి తిరిగినా.. కనికరించే వారు కరువయ్యారు. ఎవరైనా ఏదైనా తింటుంటే వారి వ్దదకు వెళ్లి అడిగితేనైనా కొంచెం ఇస్తారేమోనని అడిగేవారు ఉంటారు. ఆకలికేం తెలుసు అంటారా.. మనసు చంపుకోని మనిషిని.. కుటుంబం కోసం కుంగదీయడం తప్ప.
ఇలాంటి వారు ఎదురైతే తమకు దిష్టి తగులుతుందని కసురుకునేవారు కొందరు.. ఇంకొందరు మరో మెట్టు ఎక్కి.. ఏరా తినడానికే వచ్చావా.. లేక మేం కనబడ్డాం కాబట్టి అడగుతున్నావా.. నువ్వు దొంగవే కాదా.? అంటూ అబాండాలు కూడా వేస్తారు. మరికోందరు అంతటితోనూ అగకుండా.. అబాండాలు వేయడంతో పాటు చేయిచేసుకోవడం వరకు కూడా వెళ్తుంటారు. తన కాలే కడుపును నీళ్లతోనైనా నింపుకునేందుకు ఇష్టపడే తండ్రి.. తాను కన్న బిడ్డల కోసం ఏదైనా రుచిగా తీసుకెళ్లాలన్న తాయత్రయమే ఆ తండ్రిని తిరిగిరాని లోకావకు పంపింది. ఇలా ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరగడంతో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
సీఐ కిషన్ కుమార్ వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (32), భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్లో ఉంటూ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లర్లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టిన రోజు వేడుకలు సిబ్బందితో కలిసి చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వమంటూ రాజేశ్ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. దొంగగా పొరబడి వాళ్లంతా అతన్ని చితకబాది వెళ్లిపోయారు.
రాత్రంతా అక్కడే స్పృహ లేకుండా పడిఉన్న రాజేష్ను.. గురువారం ఉదయం హోటల్ సిబ్బంది గుర్తించారు. ఒరిస్సాలోని రాజేష్ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్ మృతి చెందాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more