2 terrorists gunned down in Kulgam of J and K భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

2 terrorists killed in kulgam encounter operations still underway j k police

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Kulgam encounter, Pulwama encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, shopian encounter, rakhama encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Shopian, Jammu and Kashmir, National politics

Two terrorists have been killed in an encounter in Jammu and Kashmir’s Kulgam, the police said on Thursday morning. The gunbattle broke out between the security forces and the terrorists at the Redwani area of Kulgam district of Jammu and Kashmir last night.

కుల్గామ్ లో ఎన్‌కౌంటర్‌.. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Posted: 12/16/2021 11:42 AM IST
2 terrorists killed in kulgam encounter operations still underway j k police

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో రెద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

కాగా ఈ ఎన్ కౌంటర్ తో హతమైన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారనేది గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. భద్రతా దళాలతో కలసి రెద్వానీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపైకి ముష్కరులు కాల్పులు జరిపడం ప్రారంభించారు. దీంతో హుటాహుటిన స్పందించిన గాలింపు దళాలు కూడా ప్రతిదాడులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. అియతే స్థానికంగాఉద్రగవాదుల కోసం గాలింపు చర్యలు కోనసాగుతున్నాయి.

పూల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరల్లో హిజ్ బుల్ ముజాహిద్దీన్ కు ఉగ్రవాద సంస్థకు చెందిన ఏ క్యాటగిరి ఉగ్రవాదిని బుధవారం రోజున బద్రతా బలగాలు హతమార్చిన మరుసటిరోజునే కుల్గామ్ లో ఇద్దరు ముష్కరులు బద్రతా బలగాలు చేతిలో మృత్యువాత పడటం గమనార్హం. పెరోజ్ అహ్మద్ దార్ అనే ఈ ఉగ్రవాది అనేక నేరాల్లో పాల్గోన్నాడని బద్రతాదళలు తెలిపాయి. షోఫియాన్ జిల్లా జైనపోరాలో 2018లో జరిగిన నలుగురు జమ్మూకాశ్మీర్ పోలీసుల మరణానికి కూడా ఫెరోజ్ పాత్ర ఉందని పోలీసులు అధికారులు తెలిపారు. 2017లో ఉగ్రవాదిగా మారిన ఆయన 2019లో ఇష్రాత్ మున్నీర్ అనే బాలిక హత్యలోనే ఫెరోజ్ అహ్మద్ నిందితుడని పోలీసుల బలగాలు పేర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles