సినీ నటి, ఎమ్మెల్యే రాజా ప్రయాణిస్తున్న విమానం బెంగుళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని బెంగళూరుకు మళ్లించి ల్యాండింగ్ చేశారు. తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం గాల్లో గంటపాటు చక్కర్లు కోట్టినా.. ల్యాండింగ్ కు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ నుంచి అనుమతి రాలేదు. దీంతో హుటాహుటిన బెంగళూరుకు మళ్లించి ల్యాండింగ్ చేశారు. అయితే బెంగుళూరులో ల్యాండింగ్ అయిన విమానంలోంచి ప్రయాణికులు ఎవరినీ దిగేందుకు విమాన సిబ్బంది అనుమతించలేదు. కాగా విమానం డోర్స్ లాక్ అయ్యాయని.. అవి అన్ లాక్ కావడానికి అనుమతి రావాలని చెప్పారు.
దీంతో నాలుగు గంటలుగా ప్రయాణికులు అందరూ బెంగళూరు విమానాశ్రయంలోనే కూర్చోని వున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా వీడియో నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడంతో ఎట్టకేలకు మెట్టుదిగిన సిబ్బంది ప్రయాణికులను విమానాశ్రయం లాంజ్ లోకి వెళ్లేందుకు అనుమతించారు. అంతకుముందు ఎమ్మెల్యే రోజా మొబైల్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ విమానంలో టీడీపీ నేత యనమల రామకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి విమానాశ్రయంలో విమానం దిగేందుకు అనుమతి రాలేదు. చాలా సేపు విమానం గాలిలో తిరగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనైనట్లు ఆమె వెల్లడించారు.
అయితే తిరుపతికి దగ్గరగా ఉన్న కడపలో కాకుండా ఆ విమానాన్ని బెంగుళూరుకు ఎందుకు మళ్లించారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ప్రయాణికులు బటయకు వెళ్లడానికి అనుమతించడం లేదన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి నాలుగు గంటలు అవుతున్నా.. ఇంకా విమానం డోర్లను తీయడం లేదన్నారు. తనకు మేజర్ సర్జరీ జరిగిందని, కడపులో 29 కుట్లు ఉన్నాయని, అయితే ఎక్కువ సమయం కుర్చీలో కూర్చవడం ఇబ్బందిగా మారుతోందని రోజా తెలిపారు. రాజమండి నుంచి ఇండిగో విమానం ఉదయం 9.20 నిమిషాలకు బయలుదేరింది. తిరుపతికి ఆ విమానం 10.20 నిమిషాలకు చేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల బెంగుళూరు విమానాశ్రయంలో ఆ విమానాన్ని దింపారు. ఆ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more