సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 60 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. మరీముఖ్యంగా యూరోప్ దేశాలలో ఇప్పటికే తన ప్రబావాన్ని చాటుతున్న ఒమిక్రాన్ ఇప్పటికే బ్రిటన్ లో ఒక మరణాన్ని నమోదు చేసుకున్నవిషయం తెలిసిందే. ఈ మేరకు బ్రిటెన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ కారణంగా అసుపత్రి పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఒమిక్రాన్ కట్టడికి ప్రజలకు కరోనా వాక్సీన్ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆయన కోరారు.
ఇప్పటికే దీని కారణంగా యూరోప్ దేశాలలో వచ్చే ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల మంది ఈ వేరియంట్ బారినపడి మరణించే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకారేనని తాజాగా వెల్లడించింది. ఇది బౌగోళిక ముప్పుగా పరిణమించిందని అందోళన వ్యక్తం చేసింది. వాక్సీన్ల ద్వారా లభించే రక్షణను కూడా ఇది ఏమార్చుతోందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని వివరించింది. తీవ్ర పరిణామాలతో మరో విజృంభనకు దారితీసే అవకాశం ఉందని అందోళన వ్యక్తం చేసింది.
అయితే, ఈ వేరియంట్ తీవ్రత గురించి ఓ అంచనాకు రావడానికి ముందు మరింత సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఒకసారి అది ప్రబలితే మాత్రం ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. అదే జరిగితే మరిన్ని మరణాలు సంభవిస్తాయని తెలిపింది. ఇక మరోవైపు అమెరికాలోని సుమారు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. 30 రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more