Telangana to experience decrese in temperatures రానున్న రోజుల్లో తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత

Telangana to experience drop in mercury in next two days

Telangana weather, Telangana temperatures, Telangana State Development Planning Society, Hyderabad weather, Kumarambheem Asifabad, Dip in mercury, low temp in Telangana, Asifabad, Adilabad, Mancherial, Sangareddy, BHEL, Rajendranagar, Hyderabad, Telangana

As days are expected to turn colder in the State as it’s experiencing a drop in minimum temperature each day. As per the Telangana State Development Planning Society, temperature at the night is likely to drop to 12 degree Celsius in Kumarambheem Asifabad, Adilabad and 13 degree Celsius at Sangareddy, Medak and Mancherial in the course of the next three days.

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత

Posted: 12/14/2021 11:55 AM IST
Telangana to experience drop in mercury in next two days

రోజురోజుకూ తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. డిసెంబర్ నెల మధ్యకు వచ్చినా ఇప్పటివరకు పెద్దగా చలి తీవ్రత లేదని భావిస్తున్న క్రమంలో గత వారం రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలపై చలిపులి పంజా విసురుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలు పక్కనబెడితే రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దిగువన నమోదు కానున్నాయిని అన్నారు. సాయంత్రం ఆరు గంటలకే రాష్ట్రంలో చలి అలుముకుంటోంది.

రానున్న రోజుల్లో చలి తీవ్రత తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపునుందని, వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం జిల్లాలోని సిర్పూర్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో 8 నుంచి 10 డిగ్రీలే ఉంటుందని అంచనా. ఈ శీతాకాలంలో ఇంతవరకూ చలి తీవ్రత పెద్దగా లేదు. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట భూవాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకు అదనంగా పెరిగింది.

దీనికి తోడు పోగమంచు కూడా రాష్ట్రాన్ని కమ్మెస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా పచ్చదనం, చెట్లు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. బాహ్య వలయ రహదారిపై విపరీత మంచుతో ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇటు రాజధాని హైదరాబాద్ నగరంలోనూ రాత్రి తొమ్మిది గంటల తరువాత ట్రాఫిక్ పెద్దగా రోడ్లపై కనిపించడం లేదు. ఈ ఏడాది వర్షాలు కూడా విరివిగా కురిసన నేపథ్యంలో చలి తీవ్రత కూడా అధికంగానే వుంటుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles