రోజురోజుకూ తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. డిసెంబర్ నెల మధ్యకు వచ్చినా ఇప్పటివరకు పెద్దగా చలి తీవ్రత లేదని భావిస్తున్న క్రమంలో గత వారం రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలపై చలిపులి పంజా విసురుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలు పక్కనబెడితే రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దిగువన నమోదు కానున్నాయిని అన్నారు. సాయంత్రం ఆరు గంటలకే రాష్ట్రంలో చలి అలుముకుంటోంది.
రానున్న రోజుల్లో చలి తీవ్రత తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపునుందని, వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం జిల్లాలోని సిర్పూర్లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో 8 నుంచి 10 డిగ్రీలే ఉంటుందని అంచనా. ఈ శీతాకాలంలో ఇంతవరకూ చలి తీవ్రత పెద్దగా లేదు. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట భూవాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకు అదనంగా పెరిగింది.
దీనికి తోడు పోగమంచు కూడా రాష్ట్రాన్ని కమ్మెస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా పచ్చదనం, చెట్లు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. బాహ్య వలయ రహదారిపై విపరీత మంచుతో ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇటు రాజధాని హైదరాబాద్ నగరంలోనూ రాత్రి తొమ్మిది గంటల తరువాత ట్రాఫిక్ పెద్దగా రోడ్లపై కనిపించడం లేదు. ఈ ఏడాది వర్షాలు కూడా విరివిగా కురిసన నేపథ్యంలో చలి తీవ్రత కూడా అధికంగానే వుంటుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more