Principal molests 17 girl students on pretext of practical exam యూపీలో దారుణం: విద్యార్థినులకు మత్తుమందు.. ఆపై లైంగికదాడి..

Uttar pradesh shocker school teacher molests 17 girl students on pretext of practical exams

school manager, CBSE Practical Exam, 10th Class girls, molested, POCSO Act, Yogesh Chouhan, Purkazi area, Purkazi MLA Pramod Utwal, Judge Sanjiv Kumar Tiwari, Uttar Pradesh rape, Crime against minors, Uttar Pradesh Crime, Muzaffarnagar, Uttar pradesh, Crime

In a horrible incident, at least 17 girl students studying Class 10 were drugged and molested by the school principal and other staff on the pretext of practical examinations. The incident took place in the Purkazi areas of Muzaffarnagar, Uttar Pradesh on November 18. According to the reports, the accused stopped the girl students at GGS International School in the night and mixed sedatives in their food.

ఉత్తర్ ప్రదేశ్లో ప్రిన్సిపాల్ అఘాయిత్యం: విద్యార్థినులకు మత్తుమందు.. ఆపై లైంగికదాడి..

Posted: 12/08/2021 01:39 PM IST
Uttar pradesh shocker school teacher molests 17 girl students on pretext of practical exams

ఉత్తరప్రదేశ్ లో మైనర్ విద్యార్థినులపై దారుణం జరిగింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పేరుతో పాఠశాల నిర్వాహకుడు అతని అసిస్టెంట్ మైనర్ బాలికపై లైంగిక దాడులకు తెగబడ్డారు. పరీక్షలు వున్నాయన్న నెపంతో వారిని తమ పాఠశాలకు రప్పించి.. వారు తినే ఆహారంలో మత్తుమందు కలపి.. వారు సృహకోల్పోయిన తరువాత వారిపై అఘాయిత్యాలకు తెగబడ్డారు. ముజఫర్ నగర్ జిల్లా పుర్కాజి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కాగా న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

వివరాల్లోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ జిల్లా పరిధిలోని పుర్కాజీ ప్రాంతంలో గల పాఠశాలకు స్థానిక పేద కుటుంబాలకు చెందిన పాఠశాల హాస్టల్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చారు. ఈ పాఠశాలలో 29 మంది విద్యార్థినులు పదో తరగతి చదువుతుండగా, వారిలో కేవలం 17 మందిని మాత్రమే ప్రాక్టికల్ పరీక్షల పేరుతో పూర్కాజీ ప్రాంతంలోని పాఠశాలకు తరలించారు. అయితే రెండు పరీక్షలు ముగిసిన తరువాత మళ్లీ మరుసటి రోజు పరీక్షలు ఉంటాయని చెప్పిన యాజమాన్యం.. వారిని అక్కడే పాఠశాలలో పడుకోవాలని అదేశించింది.

అయితే విద్యార్థినులకు ఆ రోజు రాత్రి ఆహారంగా కిచిడీ పెట్టారు. అది కాస్తా.. ఉడుకీ ఉడకనట్టుగా వుంది. దీంతో పాఠశాల నిర్వాహకుడు యోగేశ్ చౌహాన్ స్వయంగా వండి విద్యార్థులకు వడ్డించారు. అయితే అందులో మత్తమందు కలపడంతో దానిని తిన్న తరువాత విద్యార్థినులు అందరూ సృహ కోల్పోయారు. అలా నిర్జీవంగా పడుకున్న విద్యార్థినులపై నిర్వాహకుడు అతని అసిస్టెంటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, చెబితే ప్రాణాలు తీసేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత భయపడిపోయిన విద్యార్థినులు పాఠశాలకు వెళ్లలేదు.

దీంతో వారి తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిసి విస్తుపోయారు. అలా 17 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడైన పాఠశాల నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సహాయకుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చర్యలు చేపట్టింది. కేసు వివరాలను తమకు నివేదించాలని ముజఫర్‌నగర్ కలెక్టర్‌ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles