ఒక్కోసారి క్షణకాలంలో జీవితం మొత్తం మన కళ్ల ముందు కనిపిస్తుంది. పెద్ద అపద నుంచి తప్పించుకున్నప్పుడు.. లేదా ప్రాణాపాయస్థితి నుంచి తృటిలో బయట పడినప్పుడు హమ్మయ్య అనుకోవడం పక్కనబెడితే.. అమ్మో కొద్దిలో మరణపు అంచుల వరకు వెళ్లివచ్చామన్న ఫీలింగే ఎక్కువగా అనిపిస్తోంది. మహారాష్ట్రలోని ఫూణే సమీపంలోగల కళ్యాణ్ రైల్వేస్టేషన్ లోనూ ఓ 72 ఏళ్ల వృద్ద మహిళకు కూడా అదే అనుభవం ఎదురైంది. కదులుతున్న రైలు.. వేగాన్ని అందుకుంటున్న సమయంలో దానిని ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వృద్ద మహిళ.. అనుకోకుండా అదుపుతప్పి ఫ్లాట్ ఫామ్ పై పడింది. ఈ ఘటనలో అమె పైప్రాణాలు పైనే పోయాయి. అంతే అమెకు ఒక్కసారి తన జీవితం మొత్తం కళ్లఎదుట సాక్ష్యాత్కారమైంది.
ఆమె రైలు ఎక్కడాన్ని గమనించి.. కిందపడిన అమెను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమైన రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అమెను చటక్కున పక్కకులాగి రైలు కింద పడనీయకుండా చేశాడు. మరో విధంగా చెప్పాలంటే అమె ప్రాణలతో సురక్షితంగా ఉందంటే.. కానిస్టేబుల్ కాపాడటం వల్లే. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటా 55 నిమిషాలకు కళ్యాణ్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫామ్ నెంబరు 4లో చెన్నై మెయిల్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్దంగా వుంది. అదే సమయంలో ఫూణేకు చెందిన సురభి ఖర్ సుడే ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు కదలడంలో అదుపుతప్పి రైలుకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్యనున్న గ్యాప్ లో పడిపోయింది.
ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైలు ఎక్కుతున్నారా..? లేదా అని పర్యవేక్షిస్తూ అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉప్ దేశ్ యాదవ్ వెంటనే అప్రమత్తమై పరుగుపరుగు వెళ్లి అమెను బయటకు లాగారు. రైలు కదులుతున్న క్రమంలో అందులోకి ఎక్కాలని ప్రయత్నం చేయడంతో అమె అదుపుతప్పి పడిపోయింది. అమె అప్రమత్తంగా వున్న కానిస్టేబుల్ ఉపదేశ్ యాదవ్ వెంటనే అమెను బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం దిగడం రెండూ ప్రమాదకరమేనని ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులకు మరోమారు సూచించారు.
ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవి దృశ్యాలను రైల్వేశాఖ తమ సామాజిక మాద్యమాల్లో పెట్టింది. దీంతో వృద్ద ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ఉపదేశ్ యాదవ్ పై నెటిజనులు ప్రశంసలు కురుస్తున్నాయి. రద్దీగా వుంటే కళ్యాణ్ రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా సిబ్బంది బృందాలు ఎంతో అప్రమత్తంగా వుంటాయని ఉపదేశ్ యాదవ్ మరోమారు నిరూపించాడు. కానిస్టేబుల్ ఉపదేశ్ యాదవ్ పై రైల్వే ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడీయోను నెట్టింట్లో అప్ లోడ్ చేసిన పోలీసులు.. క్షణకాలం తొందరతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని కూడా సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more