దేశంలో బీజేపి మరోమారు అధికారంలోకి రాకుండా విపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని కూడా మార్చివేసి.. తమకు అనుకూలంగా సవరణలు చేస్తుందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. బీజేపీలో మరోసారి అధికారంలోకి వస్తే దేశప్రజల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లడంతో పాటు ప్రజల మధ్య సోదరభావం మచ్చకు కూడా కనిపించదని, మతాల మధ్య సర్వమత సౌభ్రాభృత్వం అదృశ్యమవుతుందని అరోపించారు.
మీడియాతో మాట్లాడినా ఆయన.. నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ 2024లో మళ్లీ అధికారంలో వస్తే.. రాజ్యాంగాన్ని మరుస్తుందని, దేశం నాశనమైపోందని పేర్కొన్నారు. అందుకే అన్ని పార్టీలు ఏకమై బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే.. రాజ్యాంగంతో పాటు దేశాన్ని కూడా రక్షించినవాళ్లమవుతామని చెప్పారు. కానీ, బీజేపీ ఓడించాలంటే మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని గత నెల నుంచి తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింకు శత్రువులని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు లేకుండా చేద్దామని వాళ్లు పని చేస్తున్నారని తీవ్రంగా వివర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒవైసీ బీజేపీతో కలిసి పని చేస్తాడని ఆరోపించారు. అదే సమయంలో దేశంలోని పేదలకు కూడా తావులేకుండా పోతుందని అరోపించారు. దేశంలో ధరలు అకాశానంటుతాయని, ఇక పేదలు తినేందుకు కూడా నిత్యావసరాలు లభ్యంచవని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more