అగ్రవర్ణ కుటుంబాల్లోని మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని, వారు కూడా బయటకు వచ్చి పురుషులతో కలిసి పనిచేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. మూడు రోజుల క్రితం అనుప్పుర్ జిల్లాలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత మాట్లాడుతూ.. ఠాకూర్, థాకరే వంటి అగ్రకులాల్లోని మహిళలను ఇళ్లకే పరిమితం అవుతున్నారని, ఆయా వర్గాల మహిళలు కూడా బయటకు వచ్చి పనిచేయాలని అన్నారు.
అయితే అగ్రవర్గాల మహిళలను కూడా ఇళ్లల్లోంచి బయటకు ఈడ్చి మరీ పనిచేయించాలని.. సభకు హాజరైన ప్రజల సాక్షిగా చెప్పిన ఆయన.. ఇప్పడు గొంతు సవరించుకున్నారు. ఆయా వర్గాల మహిళలను బయట పనులకు పంపేందుకు అంగీకరించని సమాజం.. కిందిస్థాయి వర్గాల కుటుంబాల్లోని మహిళలు మాత్రం ఇళ్లలోను, పొల్లాలోనూ పని చేస్తున్నారని చెప్పారు.సమాజంలో స్త్రీపురుషులు సమానమే అయినప్పుడు మహిళలు కూడా తమ బలాన్ని గుర్తించి పురుషులతో కలిసి పనిచేయాలని అన్నారు.
కాబట్టి అగ్రవర్ణాల మహిళలను బయటకు లాగి సమానత్వాన్ని తీసుకురావాలని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. అయితే, తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. మహిళలు సామాజిక సేవ చేయాలని మాత్రమే తాను అన్నానని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more
Aug 16 | రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేసేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది.... Read more
Aug 16 | బాలీవుడ్ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ పై ఎఫ్ఐఆర్ నమోదు. కాస్ట్యూమ్ స్టైలిస్ట్పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం బీటౌన్ లో కలకలం రేపుతోంది. తన ముంబై... Read more
Aug 16 | భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్తోట పోర్ట్కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి... Read more