బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రైతులు దీక్షలను అవహేళన చేస్తూ వారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చిన నేపథ్యంలో నలుదిక్కుల నుంచి అమె విమర్శలను ఎదర్కోంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. నిత్యం వివాదాల్లో చిక్కుకోవడం వెన్నతో పెట్టిన విద్యగా మారిన ఆమెపై నిన్న ముంబైలో మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు నమోదు కావడంపై అమె తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించిన విషయం తెలిసిందే. మరో చోట మరో కేసు అయినా తనకు ఇంటిపట్టునే వుండే మూడ్ ఉందని కంగనా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో ఓ ఫోటోను ట్వీట్ చేసి.. దానిపై ఈ మేరకు కోట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఇవాళ అమె ఇటీవల సిక్కు రైతులు, పంజాబ్ రైతులు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కంగనాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ ఆరో తేదీన హాజరుకావాలంటూ ఆదేశించారు. సిక్కులను కించపరిచే రీతిలో కంగనౌ కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా సిక్కులపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిన కంగనాపై ముంబైలోనూ కేసును నమోదు చేశారు.
ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ధర్నాలు ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేసింది. అయితే ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. అంతేకాకుండా ఎక్కడ సిక్కు రైతులకు కాంగ్రెస్ చేరువ అవుతుందోనని కూడా అమెలో అందోళన రేకెత్తి.. వారిపై కూడా బురదజల్లే ప్రయత్నాన్ని చేసింది. సిక్కులను అణిచివేసింది ఒక్క ఇందిరా గాంధీ మాత్రమే అని, మాజీ ప్రధాని ఇందిర దేశ విభజన చేయకుండా సిక్కులను అడ్డుకున్నట్లు కంగనా తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపింది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రైతుల తీరును కంగనా తప్పుపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more