బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి అంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తమిళనాడులోనూ వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కొన్నిదశాబ్దాలుగా లేని వరుణ బీభత్సాన్ని చిత్తూరు, నెల్లూరు ప్రజలు చవిచూశారు. ఇప్పటికీ పలు ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే మగ్గుతుండగా, మరో చేధువార్తను అందించింది భారత వాతావరణ కేంద్రం. రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే తెలంగాణలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని పేర్కొన్నది. దీంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఈశాన్య దిశ ఉపరితల గాలులు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షం కురిసిందని, అత్యధికంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఆదిలాబాద్ జిల్లా బోథ్ 5, వికారాబాద్ జిల్లా దోమ 3, నిర్మల్ జిల్లా సారంగపూర్ణ, కొమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లా సతుపల్లిలో రెండు సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వివరించింది. రాష్ట్రంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత సంగారెడ్డి కోహిర్లో 19.1, జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 19.4 డిగ్రీలు.. అత్యధికంగా ఖమ్మం పట్టణంలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ డీపీఎస్ పేర్కొన్నింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more