కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి వారిని నిత్యం సన్మార్గంలో నడవాలని ప్రవచిస్తూనే పీఠాధిపతి పరమపదించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మాట్లాడుతున్న స్వామిజీకి హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తాను కూర్చుకున్న కుర్చీలోనే వెనక్కు ఒరిగి ప్రాణాలను విడిచారు. ఆయన ఒక్కసారిగా వెనక్కు ఒరిగిపోవడంతో ఏమైందోనన్న అందోళనలో భక్తులు ఆయనను అసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే ప్రాణాలు వదిలారని వైద్యులు తెలిపారు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోగల బలోబల మఠంలో జరిగిన ఈ ఘటన సామాజిక మాద్యమాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి.. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి, బసవయోగ మండప ట్రస్ట్ వ్యవస్థాపకుడు అయిన సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం చేస్తున్నారు. ఇంతలో ఆయన హఠాత్తుగా తాను కూర్చున్న కుర్చీలోనే వెనక్కు ఒరిగి శివైక్యమయ్యారు. స్వామిజీ వెనక్కు ఒరిగిపోవడంతో భక్తులు అందోళన చెందారు.
పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమైమ్యారు. ఆయనకు కింద పడుకోబెట్టి గుండెను పనిచేసేలా ప్రాథమికంగా చర్యలు చేపట్టారు. మఠంలోని సిబ్బంది సహా పలువురు భక్తులు స్వామిజీని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు వదిలేసారని వైద్యులు తెలిపడంలో భక్తజనుల్లో విషాదం అలుముకుంది. కాగా, స్వామీజీ జన్మదిన ప్రసంగాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న కొందరు భక్తులు ఈ దృశ్యం రికార్డు చేశారు. స్వామి నిర్యాణ్యం అయిన తరువాత దానిని సామాజిక మాధ్యమాల్లోకి అప్ లోడ్ చేయగా, భక్తులు వీక్షణతో ఆ వీడియో వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more