ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు జగన్ సర్కారు మరోసారి బిగ్ షాకిచ్చింది. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్లో మార్పు చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణ చేసింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది. ఏపీలో రూ. 400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ విధించింది.
అలాగే రూ. 400- రూ. 2,500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. రూ. 2,500 నుంచి రూ. 3,500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్ విధించింది. రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్ పడింది. రూ. 5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది.
దేశీయ తయారీ బీర్ కేసుపై రూ. 200 కంటే తక్కువ ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్ వేయనున్నారు. రూ. 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. ఇక, అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే రెడీ టు డ్రింక్లపై 50 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
బ్రాండ్ల వారీగా పన్నులో చేసిన మార్పులు ఇలా..
* రూ.400 లోపు ఉన్న మద్యం బ్రాండ్లపై: 50 శాతం వ్యాట్
* రూ.400 నుంచి రూ.2,500 వరకు ఉన్న మద్యం కేసుపై: 60 శాతం వ్యాట్
* రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉన్న మద్యం కేసుపై: 55 శాతం వ్యాట్
* రూ.5,000, ఆపై ఉన్న మద్యం కేసుపై: 45 శాతం వ్యాట్
దేశీయ తయారీ బీర్ కేసుపై..
* రూ.200 కంటే తక్కువున్న ధర ఉన్న బ్రాండ్లపై: 50 శాతం వ్యాట్
* రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై: 60 శాతం వ్యాట్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more