తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులను విదేశాలకు తీసుకెళ్లి.. అక్కడి క్యాసినోలలో పేకాట అడించి వారు ఓడిపోయిన డబ్బులో కమీషన్ దక్కించుకునే ముఠాను పోలీసులు ఇటీవల గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్తలను, రియల్ ఎస్టేట్ ప్రముఖులతో పాటు కొందమంది రాజకీయ నేతలను కూడా విదేశాలకు తీసుకెళ్లే ముఠా.. ప్రముఖులకు అతిధ్యం ఇచ్చే క్రమంలో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మంచిరేవుల ఫామ్ హౌజ్ కేసులో టాలీవుడ్ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు.
ఫామ్ హౌజ్ను లీజుకు తీసుకున్న శివలింగ ప్రసాద్.. ఆ లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అయితే గుత్తా సుమన్తో కలిసి శివలింగ ప్రసాద్ పేకాట నిర్వహిస్తున్నట్టు నిర్ధారించిన తర్వాతే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివలింగ ప్రసాద్ను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ పిటిషన్ను శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రముఖులు ఉండగా మహబూబాబాద్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ప్రధాన నిర్వాహకుడు గుత్తా సుమన్తో పాటు మారెడు తరుణ్, వీర్ల శ్రీకాంత్, గుమ్మడి రామస్వామి చౌదరి, నందిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాస్రావు, టి.శివరామకృష్ణ, బడిగ సుబ్రహ్మాణ్యం, పండిటాపు సురేశ్, నాగార్జున, కౌతారపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమలరావు, మద్దుల ప్రకాశ్, సీవీఎస్ రాజారాం, కె.మల్లికార్జున్రెడ్డి, బొగ్గారపు నాగరాజు, గట్టు వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్రావు, బి.రమేశ్, కె.శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోల ఆదిత్య, సీహెచ్ గణేశ్, శ్రీరాం భద్రయ్య, తోట ఆనంద్ కిశోర్, షేక్ ఖాదర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.6.77 లక్షల నగదు, 33 మొబైల్ ఫోన్లు, మూడు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more