ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి రోజున.. ఓ గ్రామంలో ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లని పోలీసు అధికారిని గ్రామంలోని పేకాట రాయుళ్లు విద్యుత్ స్థంబానికి కట్టేసి మరీ చితకోట్టారు. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో గల ఛప్రా బహాస్ పరిధిలోని ధర్మమ్ పూర్ గ్రామంలో దీపావళి రోజున చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనను గ్రామంలోని కొందరు యువకులు నెట్టింట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో జరిగిన ఘటనను తెలుసుకున్న పోలీసు అధికారులు చర్యలకు అదేశించారు.
జిల్లాలోని సుగాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్ పురలో ఘర్షణ జరుగుతున్నట్టు దీపావళి రోజున సాయంత్రం పోలిస్ స్టేషన్ సమాచారం అందింది. ఉన్నాతాధికారుల అదేశాల మేరకు ధరమ్ పూర గ్రామానికి వెళ్లిన ఏఎస్సై సీతారం దాస్ బయలుదేరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికంగా ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని.. ఇంతకీ ఎక్కడ గోడవ జరుగుతుందని స్థానికులను ఆరాతీశఆడు. అంతే.. పోలీసు దుస్తుల్లో వున్న ఏఎస్సైని చూడగానే అక్కడి యువకులు మరింతగా రెచ్చిపోయారు. దీపావళి రోజున గ్రామంలోకి పోలీసులు రైడింగ్ చేయడమేంటని యువకులు అతడ్ని టార్గెట్ చేశారు.
ఆ వెంటనే రంగంలోకి దిగిన పేకాటరాయుళ్లు మరింత అక్రోశంతో.. ఏఎస్ఐని చేతులు కట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై వున్న విద్యుత్ స్థంభానికి కట్టేసి మరీ కొట్టారు. చేతులను తాళ్లతో వెనక్కి కట్టేశారు. ఆపై అందరూ కలిసి చితకబాదారు. తనకు సమాచారం రావడంతోనే గ్రామంలోకి వచ్చానని చెప్పినా వినిపించుకోని పేకాటరాయుళ్లు అతడు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా దాడికి పాల్పడ్డారు, ఈ ఘటన మొత్తాన్ని ఎవరో సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆ తర్వాత కాసేపటికి బంధించిన ఏఎస్సైని యువకులు విడిచిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more