హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ శనివారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమ విపక్ష పార్టీ నేతలపై రంకెలేసారు. అంతేకాదు విపక్షపార్టీ నేత దీపేందర్ హూడాను కూడా టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కళ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తామని’’ అన్నారు. ఇలా అధికారంలోని బీజేపి నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక నెట్ జనులు పార్లమెంటు సభ్యులు మాట్లాడిన వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఔను ఇంతలా ఆయన కాంగ్రెస్ నేతలపై ఎందుకు విరుచుకుపడ్డారు.
ఇంతకీ ఆయన ఏం అన్నారంటే.. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్ను వ్యతిరేకించే వారి కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. క్రితం రోజున రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న బీజేపీ నేత మనీష్ గ్రోవర్ను రైతులు శుక్రవారం ఘెరావ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను పని లేని తాగుబోతులని ఆయన విమర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మనీష్ గ్రోవర్ గుడిలో ఉన్నట్లు తెలిసి దానిని చుట్టుముట్టారు. సుమారు 8 గంటల పాటు గుడిలో ఉన్న బీజేపీ నేతలను నిర్బంధించారు. గ్రోవర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చివరకు చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. దీనిపై హర్యానాలోని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. అయితే తాను ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని అనంతరం గ్రోవర్ అన్నారు. చేతులు ఊపాలని తనను కోరగా తాను అలా చేసినట్లు చెప్పారు. మరోవైపు రోహతక్ బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ, ఈ పరిణామాలపై స్పందించారు. తమ పార్టీ నేత గ్రోవర్కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ నేతల కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని ఆయన హెచ్చరించారు. హర్యానాలో 25 ఏండ్లు తాము అధికారంలో ఉంటామని, కాంగ్రెస్ చక్కర్లు కొడుతుందని విమర్శించారు.
#WATCH | Congress&Deepender Hooda should listen
— ANI (@ANI) November 6, 2021
that if anyone dares to look towards Manish Grover (BJP leader) then we'll take their eyes out. If they put hands on him then their hands will be chopped off: BJP MP Dr Arvind Sharma in Haryana's Rohtak on yday's incident at Kiloi pic.twitter.com/RhhZuq0PGL
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more