ఎరువుల కోసం దుకాణాల ఎదుట గంటల కొద్దీ సమయం నిలబడి.. అస్వస్థతలోనై రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ మధ్య రైతులకు ఏం జరిగినా అది వార్త కాదు అన్నట్లు మారిపోతోంది. అలానే ఈ వార్త కూడా పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కానీ ఇవాళ ఆ నలుగురు రైతు కుటంబాలను ఓదార్చేందుకు తన సంతాపాన్ని తెలిపేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రావడంతో విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది.
ప్రియాంక గాంధీ వాద్రా అసువులు బాసిన రైతు కుటుంబాలను ఇవాళ కలిశారు. అయితే అమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి పరామర్శల కోసం వస్తే చాలు అడ్డుకునే పోలీసులు ఈ సారి అమెను ఎక్కడా అడ్డుకోలేదు. దీంతో అమె నేరుగా లలిత్ పూర్ కు వెళ్లి అక్కడ మరణించిన నలుగురు రైతు కుటుంబాలను పరామార్శించారు. బాధిత కుటుంబాలకు తాము అండగా నిలబడతామని అన్నారు. తమ పార్టీ తరపున అమ వారికి తగు సాయాన్ని అందిస్తామని ప్రియాంక హామి ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఎరువుల కొరతతో రైతులు బాధపడుతన్నా వారిని ఆదుకునే చర్యలను ప్రభుత్వం తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు వారు ఎంత ప్రయత్నించినా వారిని ప్రభుత్వం లక్ష్యపెట్టడం లేదంటూ దుయ్యబట్టారు. వారు కొన్ని నెలల నుంచి రోడ్లపై కూర్చోని నిరసలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి పట్టదు.
రైతులు బాధలు వినేందుకు ప్రభుత్వం వద్ద అసలు సమయమే లేదని ధ్వజమెత్తారు. రైతులను పూర్తిగా విస్మరించి రాష్ట్రమంతా సస్యశ్యామలంగా, నిర్మలంగా ఉందని ప్రచారాలు చేసుకుంటారు. రైతులకు ఎరువులు కూడా అందించలేని దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే అందుకు కారణం ప్రభుత్వం కాదా అని అమె ప్రశ్నించారు. రైతులను అలక్ష్యం చేసే ప్రభుత్వంలోని నేతలకు.. వారిని వాహనాలతో తొక్కించేందుకు మాత్రం చాలా సమయం ఉంటుందని దుయ్యబట్టారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రియాంకాగాంధీ చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more