ఎరువుల కోసం దుకాణాల ఎదుట గంటల కొద్దీ సమయం నిలబడి.. అస్వస్థతలోనై రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ మధ్య రైతులకు ఏం జరిగినా అది వార్త కాదు అన్నట్లు మారిపోతోంది. అలానే ఈ వార్త కూడా పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కానీ ఇవాళ ఆ నలుగురు రైతు కుటంబాలను ఓదార్చేందుకు తన సంతాపాన్ని తెలిపేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రావడంతో విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది.
ప్రియాంక గాంధీ వాద్రా అసువులు బాసిన రైతు కుటుంబాలను ఇవాళ కలిశారు. అయితే అమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి పరామర్శల కోసం వస్తే చాలు అడ్డుకునే పోలీసులు ఈ సారి అమెను ఎక్కడా అడ్డుకోలేదు. దీంతో అమె నేరుగా లలిత్ పూర్ కు వెళ్లి అక్కడ మరణించిన నలుగురు రైతు కుటుంబాలను పరామార్శించారు. బాధిత కుటుంబాలకు తాము అండగా నిలబడతామని అన్నారు. తమ పార్టీ తరపున అమ వారికి తగు సాయాన్ని అందిస్తామని ప్రియాంక హామి ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఎరువుల కొరతతో రైతులు బాధపడుతన్నా వారిని ఆదుకునే చర్యలను ప్రభుత్వం తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు వారు ఎంత ప్రయత్నించినా వారిని ప్రభుత్వం లక్ష్యపెట్టడం లేదంటూ దుయ్యబట్టారు. వారు కొన్ని నెలల నుంచి రోడ్లపై కూర్చోని నిరసలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి పట్టదు.
రైతులు బాధలు వినేందుకు ప్రభుత్వం వద్ద అసలు సమయమే లేదని ధ్వజమెత్తారు. రైతులను పూర్తిగా విస్మరించి రాష్ట్రమంతా సస్యశ్యామలంగా, నిర్మలంగా ఉందని ప్రచారాలు చేసుకుంటారు. రైతులకు ఎరువులు కూడా అందించలేని దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే అందుకు కారణం ప్రభుత్వం కాదా అని అమె ప్రశ్నించారు. రైతులను అలక్ష్యం చేసే ప్రభుత్వంలోని నేతలకు.. వారిని వాహనాలతో తొక్కించేందుకు మాత్రం చాలా సమయం ఉంటుందని దుయ్యబట్టారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రియాంకాగాంధీ చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.
(And get your daily news straight to your inbox)
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more
May 25 | కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చుతూ జీవో విడుదల చేయడంతో చేపట్టిన ఆందోళనలను ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించేందుకు వస్తామని... Read more