కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తొలిసారి ప్రజల భయాందోళనల నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ విపరీతంగా ప్రభావం చూసిన కోవిడ్ అనేక మందిపై ప్రభావాన్ని చూపింది. ఇక రెండో దశలో మరింత వేగంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ తొలిసారి కంటే రెట్టింపు వేగంతో విజృంభించింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ లలో మూడవ దశ ప్రభావం చూపుతుందన్న అంచనాలు మెళ్లిగా సన్నగిల్లాయి. కరోనా మహమ్మారి సాధారణ జలుబులా మారిందని.. ఇక దీంతో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా పలు అధ్యయానాలు వెల్లడించాయి.
అయితే ప్రజలకు కూడా మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం వంటి చర్యలకు రమారమి స్వస్తి పలికారు. కరోనాకు ముందున్న పరిస్థితులు తిరిగి వచ్చాయని.. అప్పటిలానే వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఆదమరిచి అప్రమత్తతకు స్వస్తి పలికిన నేపథ్యంలో మరోమారు కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలపై మళ్లీ ప్రతాపం చూపుతూ.. జూలై తరువాత అత్యధిక కేసులు, మరణాలతో పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. అమెరికా, బ్రిటెన్, ఇటలీ, ఇంగ్లాండ్ సహా దాదాపు అన్ని దేశాల్లోనూ మళ్లీ పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఇంగ్లండ్లో గత వారం రోజులుగా సగటున 45 వేల కేసులు నమోదయ్యాయి. ఇక సోమ, బుధవారాల్లో ఏకంగా 49 వేల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 3 లక్షల 11 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు గత వారంలో నమోదయ్యాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి పది లక్షల మందిలో ఏకంగా 4551 మందికి కరోనా ప్రభావానికి గురయ్యారని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా ధర్డ్ వేవ్ నుంచి రక్షణ కోసం ఇచ్చిన కరోనా టీకాలు కూడా థర్డ్ వేవ్ పై అంతగా ప్రభావం చూపలేదని అరోగ్య నిపుణులు నిట్టూర్పుస్తున్నారు. గత వారంరోజుల్లో 908 మరణాలు సంభవించాయని, అందులో మంగళవారం రోజున సంభవించిన 223 మరణాలు మార్చి నుంచి అత్యధికమని అన్నారు.
డెల్టా వేరియంట్లోని ఏవై 4.2 రకమే కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఈ రకం డెల్టా కంటే 15 శాతం ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. రష్యాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ ప్రతి రోజు 33 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండగా, వెయ్యికిపైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 4.18 లక్షల మంది కరోనాకు బలయ్యారు. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండడం, ఆంక్షలు లేకపోవడమే తాజా పరిస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాలోనూ డెల్టా వేరియంట్లోని తాజా రకం విజృంభణ మొదలైంది. రాజధాని కాన్బెర్రా, సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అమెరికాలో రోజుకు 90 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐసీయూలపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా బారినపడి పెద్ద వయసు వారు ఎక్కువగా మరణిస్తున్నారు. కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నా, మరణాలు పెరుగుతున్నా టీకా వేయించుకునేందుకు మాత్రం అమెకన్లు ఇంకా విముఖత చూపుతూనే ఉన్నారు. టీకాలు సరిపడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఏడుకోట్ల మంది కనీసం ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు. వీరివల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more