రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా ఎదుట ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన విశాఖపట్టణం పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు గత అర్ధరాత్రి గుంటూరు వచ్చారు. విశాఖ పోలీసుల రాక నేపథ్యంలో ఆనంద్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు అందించే ప్రయత్నం చేశారు.
గంజాయి ఏయే ప్రాంతాల్లో లభ్యం అవుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ నేత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క విశాఖలోనే కాదని, రాష్ట్రం మొత్తం గంజాయి దొరుకుతోందని అన్నారు. గుంటూరులోనూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. నల్గొండ జిల్లా పోలీసులు వచ్చి, నాలుగు రోజులు ఏపీలో ఉన్నారని, వారికి సమాచారం అందింది కాబట్టే వారు ఇక్కడకు వచ్చి నిఘా పెట్టారని అన్నారు. ఇలాంటి ఘటనలపై ఓ మాజీ మంత్రిగా తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
అయితే ఆధారాలు చూపాలని పోలీసులు పేర్కోనగా.. వాటిని సమకూర్చే పని తనది కాదని.. వాటిని వెతికి పట్టుకోవాల్సిన పని పోలీసులదని ఆయన అన్నారు. రాష్ట్రంలో సరికొత్త విధానాన్ని డీజీపీ తెరపైకి తెచ్చారని, ప్రతిపక్ష నేతలు కొత్త అంశాల గురించి మాట్లాడితే వెంటనే నోటీసులు ఇస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు ఏదీ మాట్లాడినా దానికి సాక్ష్యాలను, ఆధారాలను తామే చూపాలని పోలీసులు చెప్పడం హాస్యస్పదంగా వుందని అన్నారు. సాక్ష్యాలను, ఆధారాలను టీడీపీ నేతలే సమకూర్చితే ఇక పోలీసులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
అదే సమయంలో ఆనందబాబు ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సింది పోయి, దానిపై మాట్లాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమని ఆలపాటి మండిపడ్డారు. మాజీ మంత్రి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారన్న వార్త దవనంలా వ్యాపించడంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారు వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో నర్సీపట్నం పోలీసులు ఆనంద్ బాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more