Suryapet youth dies in malaysia falling into sea మలేషియాలో సూర్యాపేట యువకుడు మృతి

Youth from suryapet working in malaysia falls into sea from ship dies

Rishivardhan Reddy, Malaysia, Madhavi, Private ship company, Venkata Ramana Reddy, Suryapet district, Telangana, crime

Rishivardhan Reddy, who is working for a private shipping company in Malaysia, has died after he accidently fell into the sea from a ship. He belongs to Suryapet city in Telangana state. His parents are Venkataramana Reddy and Madhavi. The 21-year-old died on Monday and parents came to know about his death after Malaysian authorities have informed them.

మలేషియాలో ప్రైవేటు నౌకలో పనిచేస్తూ తెలంగాణ యువకుడు మృతి

Posted: 10/19/2021 11:27 AM IST
Youth from suryapet working in malaysia falls into sea from ship dies

తెలంగాణకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. రాష్ట్రంలోని సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల రిశివర్థన్ రెడ్డి ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడు. సూర్యాపేటకు చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిషివర్ధన్ రెడ్డి(21) ఉద్యోగ రిత్యా మలేషియాకు వెళ్లాడు. అక్కడి ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృత్యువాత పడ్డాడు.

సోమవారం ఉదయం షిప్‌పై నుంచి సముద్రంలో పడిపోవడంతో అతను మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు మృతుని తల్లిదండ్రులు తెలిపారు. వారం క్రితమే తమ బిడ్డ ఫోన్ చేశాడని, విధుల పట్ల వత్తిడి చేస్తున్నట్లు చెప్పాడని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. త్వరలోనే వేరే కంపెనీకి మారతానని చెప్పిన కుమారుడు వారంలోనే మరణించినట్లు వార్త వచ్చిందని బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వారంరోజలు క్రితం తమకు ఫోన్ చేసిన తమ కుమారుడు ప్రైవేటు షిప్పింగ్ కంపెనీలో తీవ్రమైన పని ఒత్తిడి వుందని తమకు చెప్పాడని రిశివర్థన్ రెడ్డి తల్లిదండ్రులు అరోపించారు. అంతేకాకుండా యాజమాన్యంలోని ఉన్నతాధికారుల నుంచి కూడా తీవ్రమైన ప్రెషర్ వుందని చెప్పాడని తెలిపారు. ఈ క్రమంలో తమ బిడ్డ ఆ కంపెనీలో ఉద్యోగం మానేసి ఇతర కంపెనీలో చేరుతానని కూడా తమతో చెప్పాడని.. ఆ ప్రయత్నాల్లో వున్నందువల్లే ఉన్నతాధికారులు అతడ్ని మరింతగా వెధించి ఉంటారని వెంటకర్ రెడ్డి అరోపిస్తున్నారు. లేకపోతే వారి పని ఒత్తిడి నేపథ్యంలో తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడివుంటాడని రుషివర్దన్ రెడ్డి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles