ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన నలుగురు రైతుల మరణానికి సంయుక్తి కిసాన్ మోర్చ ఇవాళ వేలాది మంది రైతులతో ఘన నివాళులు అర్పించింది. సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఇవాళ హక్కుల సాధనలో అమరులైన రైతులకు ఇవాళ అంతిమ ప్రార్థనల పేరుతో అంతిమ్ అర్దాస్ నిర్వహించారు. ఈ ప్రార్థనలకు హాజరయ్యేందుకు కిసాన్ పోరాట సమితి అధ్యక్షుడు రాకేసశ్ తికాయత్ నిన్న సాయంత్రమే ఇక్కడకు విచ్చేయగా, ఇవాళ లఖీంపూర్ ఖేరికి బయలుదేరి వస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.
సీతాపూర్ లో ప్రియాంక గాంధీ వాద్రాను అడ్డుకున్న పోలీసులు.. మరోవైపు అర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను బరేలిలో హాజ్ అరెస్ట్ లో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరణించిన రైతులకు నివాళులర్పించేందుకు ఉత్తరప్రదేశ్తోపాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 50 వేల మంది రైతులు చేరుకున్నారు. తొలుత పాలియా నుంచి వచ్చిన రాగి జాతా గుర్బానీని వివరించడం ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. మరణించిన రైతుల కుటుంబాలు, గాయపడిన రైతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
కాగా ఉద్రిక్తతల మధ్య ఎట్టకేలకు ప్రియాంక గాంధీకి పోలీసులు లఖింపూర్ ఖేరికి వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేయడంలో అమె టికునియాకు చేరుకుని అమరవీరులైన రైతుల అంతిమ్ అర్దాస్ కు హాజరయ్యారు. రైతులు ఘనంగా నివాళులు ఘటించారు. ఇక అర్ఎల్డీ నేత జయంత్ చౌదరీని కూడా పోలీసులు అంతిమ్ అర్థాస్ కు వెళ్లేందుకు అనుమతించడంతో ఆయన కూడా హాజరై రైతుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరిలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ ను అడ్డుకుని రైతులు ఘెరావ్ చేయడంతో వారిని తోక్కించుకుంటూ వెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతర అల్లర్ల ఘటనలో మరో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more