మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలలో ధరల పట్టికను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ విడుదల చేశారు. ఎన్నికలు ముగిసే లోపు ప్రతీ అభ్యర్థి మూడు పర్యాయాలు తగు బిల్లులతో తమ ఎన్నికల ఖర్చులను ఆమోదం చేసుకోవాలని తెలిపారు. కాగా ఈ సారి ఉప ఎన్నికల ఖర్చును రూ. 30.80 లక్షలుగా నిర్ణయించారు. ఇదే గరిష్టవ్యయమని, దీనిని దాటి అభ్యర్థులు ఎవరూ ఖర్చులు పెట్టరాదని సూచించారు. ఇక మీడియా ప్రకటనలు కూడా ఎన్నికల వ్యయం కిందకే వస్తాయని తెలిపారు.
ప్రచారంలో వినియోగించే టోపీలు, కండువాల నుంచి సభల్లో వినియోగించే టెంట్లు, లౌడ్ స్పీకర్లు, డోలు కళాకారులు, దప్పుల కళాకారులు, కళాబృందాల వరకు వ్యయాన్ని నిర్ణయించింది. ఫంక్షన్ హాళ్లు, ఏసీ, నాన్ఏసీ, పాంప్లెంట్లు, వీడియో గ్రాఫర్స్, టీ షర్టులు, ఫైర్ క్రాకర్స్ ఇలా అన్నింటికి ధరలను ఖరారు చేసింది. ఖరారు చేసిన ధరల వివరాలను శుక్రవారం పార్టీల అభ్యర్థులకు సూచించింది. ఇకపై ఇవే ధరలను బట్టి అభ్యర్థుల వ్యయాన్ని ఎన్నికల డైరీలో నమోదు చేయడం సుస్పష్టం. ఇక ఎన్నికల ఏజెంట్ పేరున బ్యాంకులో జాయింట్ ఖాతాను తెరచి అందులోంచి మాత్రమే డబ్బును వినియోగించాల్సి వుంటుందని తెలిపారు.
నిర్ణయించిన ధరల వివరాలిలా..
* లౌడ్ స్పీకర్లు విత్ అంప్లిఫైర్, మైక్రోఫోన్ రోజుకు రూ.600(వంద వాట్స్), రూ.1500(200వాట్స్), టెంటుకు సైజును బట్టి రూ.2వేల నుంచి 2800, క్లాత్ బ్యానర్(స్కె్వర్ ఫీటుకు) సైజును బట్టి రూ.8 నుంచి రూ.12 వరకు, క్లాత్ ఫ్లాగ్స్కు రూ.65, ప్లాస్టిక్ ఫ్లాగ్స్కు రూ.350, పోస్టర్స్ విత్ మల్టీకలర్స్ సైజును బట్టి రూ.8వేల నుంచి రూ.70వేల వరకు.
* హోర్డింగ్స్కు అన్ని కలిపి రూ.9500ల నుంచి రూ.11వేలు, కటౌట్ స్క్వేర్ ఫీటుకు రూ.90, వీడియో మేకింగ్ చార్జీ(ఒక రికారి్డంగ్) రూ.10వేలు, ప్రచార రథం(ఆడియో) ఒక రికార్డింగ్కు రూ.5వేలు.
* అద్దె వాహనాలకు సంబంధించి జీపు, టెంపో, ట్రకెట్, సుమో, క్వాలీస్కు రోజుకు రూ.1700, ట్రాక్టర్కు రూ.1500, ఇన్నోవా రూ.2200, మిని బస్ రూ.2500, కారు రూ.1400, త్రీవిలర్స్, ఆటో రిక్షా రూ.450, బత్త చార్జీ డ్రైవర్కు ఒక రోజుకు రూ.400.
* హోటల్ రూం, గెస్ట్ హౌస్అద్దెకు సంబంధించి డీలర్స్ పర్డే రూ.2వేలు, నార్మల్ పర్ డే రూ.వెయ్యి, ఫర్నీచర్ అద్దెకు సంబంధించి ప్లాస్టిక్ ఛైర్ రూ.7, వీఐపీ ఛైర్ రూ.75, సోఫా రూ.350, టేబుల్ రూ.50, వీడియో ప్రొజెక్టర్ పర్డే రూ.1500, కండువా రూ.15, టోపీ రూ.20.
* కళాబృందాలు ఒక్కొక్కరికి రూ.500, డోలు ఆర్టిస్ట్కు రూ.500, దప్పులు ఆర్టిస్ట్కు రూ.500, ద్విచక్రవాహనం రూ.200, ఫంక్షన్ హాల్ విత్ ఏసీ రూ.10వేలు, నాన్ ఏసీ రూ.5వేలు, వీడియో గ్రాఫర్ ఛార్జీ రూ.1500, పాంప్లెంట్లు(చిన్నవి) వెయ్యికి రూ.250, పెద్దవి వెయ్యికి రూ.500.
* స్నాక్స్కు సంబ«ంధించి ఒక పెద్ద సమోసాకు రూ.12, చిన్న సమోసాకు రూ.3, సాఫ్ట్ డ్రింకు రూ.10, లస్సీ రూ.5, టీ షర్ట్ రూ.100, బలూన్ ప్యాకెట్ పర్ ప్యాకెట్ రూ.150, ఫైర్ క్రాకర్స్ పర్ కేజీ రూ.300, ప్లకార్డు ఎ3 రూ.20, ఎ4 రూ.12, గర్లాండ్ స్మాల్ రూ.50, గజమాల రూ.800, చిన్న ఫ్లాగ్ రూ.30, పెద్ద ఫ్లాగ్ రూ.100, రెడ్ కార్పెట్ రూ.300, గ్రీన్ కార్పెట్ రూ.500, ఫ్యాన్ రూ.100, కూలర్ రూ.300, ఎల్ఈడీ స్క్రీన్ సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.లక్ష, ఎల్ఈడీ స్క్రీన్ విత్ సౌండ్ సిస్టమ్,జనరేటర్, వెహికిల్ సైజును బట్టి రూ.15వేల నుంచి రూ.1.20లక్షలు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more