రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అదే స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సారి ఉధ్యోగులు, పెన్షనర్ల కష్టాలపై ఆయన రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తారీఖు తమ కష్టాలను తీర్చే రోజని ఇన్నాళ్లు భావించారని, అయితే వైసీపీ పాలనతో ఒకటో తారీఖుకు వున్న ప్రాముఖ్యత చెరిగిపోయిందని ఆయన వ్యంగోక్తులు విసిరారు. ప్రభుత్వం కోసం పనిచేస్తూ కూడా జీతాల కోసం ఒకటో తారీఖు తరువాత కూడా ఉద్యోగులు పడిగాపులు కాయాల్సిన దౌర్భాగ్యం రాష్ట్రంలో అలుముకుందని అన్నారు.
ఒకటో తారీఖు అంటే జీతాలు, వేతనాలు, పెన్షన్లు వచ్చే రోజని భావించిన ఉద్యోగులు, కార్మికులు, పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు భావిస్తారని, అయితే ఒకటవ తేదీకి ఆ ప్రాముఖ్యతను, అర్థాన్ని రెండింటినీ మార్చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఒకటో తేదీన వేతనాలు వస్తాయన్న విషయాన్ని కూడా ఉద్యోగులు మార్చిపోయేలా వైసీపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఎప్పడు లభిస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకోందని, ఈ అనిశ్చితికి ఏపీ ప్రభుత్వ అర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోందని పేర్కోన్నారు.
పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు తమ సర్వీసునంతా ప్రభుత్వానికి ఖర్చు చేసినా.. వారికి కూడా సకాలంలో పెన్షన్లు అందకపోవడం బాధాకరమని అన్నారు. దశాబ్దాల పాటు ఉద్యోగ సేవలు అందించి విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నా.. పదే పదే పెన్షన్ల వచ్చాయా లేదా అని చూసుకోవడం కోసం బయటకు వెళ్తున్నారని, కొందరు ఇంకా పెన్షన్ రాలేదని అందోళనకు గురవుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారమని పవన్ చెప్పారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారని అభిప్రాయపడ్డారు.
పోలీసులకు గడచిన 11 నెలలుగా టి.ఏ కూడా లభించడంలేదని పవన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం 7 డి.ఏలు బకాయి పడిందని, పీఆర్సీ కూడా అమలు చేయడంలేదని ఆరోపించారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే డి.ఏ, టి.ఏ, పీఆర్సీ అడగరని, జీతం ఇస్తే అదే పదివేలు అని ఉద్యోగులు భావిస్తారని ప్రభుత్వం అనుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలసరి ఆదాయం గతేడాది కంటే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయని, మరి ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు కూడా చేయడంలేదంటే ఆ ఆదాయం ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more