ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు భారత ప్రభుత్వానికి తొలిసారిగా.. అధికారికంగా లేఖను రాశారు. ఈ లేఖలో వారు వినమ్రపూర్వకంగా భారత సర్కురుకు విన్పపాన్ని వినిపించారు. భారత్ ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇదివరకే స్పష్టం చేసిన తాలిబన్లు.. కాశ్మీర్ అంశంలో మాత్రం మాటమార్చిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశంలో భారత్- పాకిస్థాన్ దేశాలు పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన వారం రోజుల వ్యవధిలోనే కాశ్మీర్ లోని ముస్తింల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత తమపై వుందని అన్నారు.
తాలిబన్లు రెండు నాల్కల ధోరణితో అప్రమత్తంగా ఉన్న భారత పరిస్థితుల్ని నిషితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో తాలిబన్ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖపై దృష్టి సారించింది. ఈ లేఖలో భారత్- అప్ఘనిస్తాన్ దేశాల మధ్య విమానాలను పునరుద్ధరించాలని ఆ లేఖలో తాలిబన్లు కోరారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ పేరుతో ఈ లేఖ వచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ కుమార్కు తాలిబన్లు ఈ లేఖను పంపించారు. ఆఫ్ఘనిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హమీదుల్లా అకున్జదా ఈ లేఖను రాశారు. కాగా ఈ లేఖను సెప్టెంబర్ 7వ తేదీన ఈ లేఖ రాసినట్లుగా తేదీ వేయబడివుంది.
అమెరికా బలగాలు తిరిగి వెళ్లిపోయే సమయంలో కాబూల్ విమానాశ్రయాన్ని దెబ్బతీశారని... అయితే ఖతార్ సాంకేతిక సాయంతో దానిని పునరుద్ధరించామని పేర్కోన్నారు. ఈ ఘటనలో ఈ నెల 6న ఎయిర్ మెన్ కు నోటీసు జారీచేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య విమానాలను పునరుద్ధరించాలని కోరుతున్నామని హమీదుల్లా పేరున ఈ లేఖ రాశారు. రెండు దేశాల మధ్య ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నామని పేర్కోన్నా. మా అధికారిక ఎయిర్ లైన్స్ అరియానా ఆఫ్ఘన్, కామ్ ఎయిర్ తమ విమానాలను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాయి. వాణిజ్య విమానాలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాము అని ఆ లేఖలో కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more