భారత భూబాగంలోకి చోరబడేందుకు అక్రమంగా వస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత సైన్యం మరోసారి భగ్నం చేసింది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లోని ఉరి సెక్టార్ల్లో చోరబాటు యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదిన భారత బలగాలు సజీవంగా అదుపులోకి తీసుకున్నాయి. చాలా ఏళ్ల తరువాత ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎస్ బలగాలు పాకిస్థాన్ ఉగ్రవాదిని సజీవంగా అదుపులోకి తీసుకున్నాయి. భారత భూబాగంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ చొరబాటుదారుల ప్రయత్నాలపై భారత ఆర్మీ నీళ్లు చల్లింది. అక్రమంగా దేశంలోకి చోరబాడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై ఇండియన్ అర్మీ బలగాలు కాల్పులు జరపడంతో కొందరు పారిపోగా ఒకరు మరణించారు. మరోకరు సజీవంగా పట్టుబడ్డాడు.
గత ఐదు రోజుల వ్యవధిలో అక్రమంగా భారత భూబాగంలోకి చోరబడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు నలుగురు ప్రాణాలను కోల్పోయారు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదలు దేశంలోకి అక్రమంగా చోరబడేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. జమ్మూకాశ్మీర్ లో శాంతి,సామరస్యతకు విఘాతం కలిగిస్తూ.. మతవిధ్వేషాలను కూడా రెచ్చగోట్టేందుకు ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తూనే వున్నారు. కాగా ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ పై ఆర్మీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సెప్టెంబర్ 18 నుండి ఉరి సెక్టార్లో నిరంతర చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నెల 23న భారత బలగాలు అడ్డుకుని కాల్పులు జరపడంతో ముగ్గురు ముష్కరులు మరణించారు. కాగా కాల్పులతో అప్రమత్తమైన మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. గత కొంతకాలంగా ఇద్దరి కోసం అన్వేషణ జరుగుతోంది. భారత ఆర్మీ జవాన్లు కూడా సుదీర్ఘ ఎన్కౌంటర్ జరిపారు, జమ్మూకాశ్మీర్ లోని విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా, పాకిస్తాన్ సైన్యం నిరంతరం అలాంటి ప్రయత్నాలలో నిమగ్నమై ఉందని వారు అరోపిస్తున్నారు. గత కొంతకాలంగా చోరబాట్లు తగ్గముఖం పట్టినా గత నెల రోజుల నుంచి అధికమయ్యాయని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more