పేదలకు చెందిన బ్యాంకు ఖాతాలలో కోట్లాది రూపాయలు జమ అవుతున్న వరుస ఘటనలు బీహార్ రాష్ట్రంలో వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏ బ్యాంకు అకౌంటు లేని ఓ దినసరి కూలీ ఖాతాలోనూ కోట్లాది రూపాయలు జమకావడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా కూడా లేని దినసరి కూలి పేరున బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ తెరచి అందులో రమారమి పది కోట్ల రూపాయలను వేయడం బీహార్ రాష్ట్రంలోని పెను సంచలనంగా మారింది. తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచి వుందని, అందులో ఏకంగా రూ.9.99 కోట్లు వున్నాయని తెలిసి కూలీ విస్తుపోయాడు.
కరోనా మహమ్మారి కారణంగా ఇంతకు ముందులా కూలీ పనులు రోజు లభించకపోవడంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం కింద తన పేరును నమోదు చేసుకోవడం కోసం వెళ్లి.. తన పేరున జాబ్ కార్డు తీసుకునేందుకు వెళ్లాడు. ఉపాధి హామీ పనుల డబ్బులు నేరుగా తమ ఖాతాలోకి వస్తాయని తెలియడంతో ఆయన చేసేది లేక తన పేరున బ్యాంకు అకౌంట్ తీసేందుకు యూనియర్ బ్యాంక్ అఫ్ ఇండియా సుపాల్ బ్రాంచికి చెందిన కస్టమర్ ఔట్ లెట్ పాయింట్ కు వెళ్లాడు. అక్కడ అతని ఆదార్ నెంబరుపై సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వుందని, అందులో దాదాపుగా పది కోట్ల రూపాయలు వున్నాయని తెలిసింది. దీంతో తాను అసలు బ్యాంక్ ఖాతను తెరవలేదని దినసరి కూలి అయిన విపిన్ చౌహాన్ పేర్కొన్నాడు.
కాగా ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నేను సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాను, అధికారులు ఖాతా వివరాలను తనిఖీ చేసారు. ఇది అక్టోబర్ 13, 2016 న తెరవబడిందని, కాగా ఫిబ్రవరి 2017 లో కోట్లాది రూపాయల లావాదేవీ తన ఖాతాలో జరిగిందని అన్నాడు. అయితే ఖాతా తెరిచేందుకు బ్యాంకు అధికారి తన ఫోటోను, వేలిముద్రను, సంతకాలను తనవి కావని, అయితే ఆధార్ కార్డు మాత్రమే తనదని చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం రూ. 9.99 కోట్లు ఇప్పటికీ ఖాతాలోనే ఉన్నాయి "అని చౌహాన్ చెప్పారు. దీంతో బ్యాంక్ అధికారులు అకౌంట్ లోని డబ్బును హోల్డ్ లో పెట్టారుచ
బీహార్లో ఇలా డబ్బులు తమ ఖాతాల్లోకి వచ్చి పడటం ఇది కొత్త అంశమేమి కాదు. బీహార్ లోని ముజఫర్పూర్ జిల్లాలోని కాట్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారి గ్రామానికి చెందిన రాం బహదూర్ షా బ్యాంక్ ఖాతాలో రూ .52 కోట్లు వచ్చి చేరాయి. అంతకుముందు ఇదే రాష్ట్రంలో 6 వ తరగతికి చెందిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు - ఆశిష్ కుమార్, గురుచరణ్ బిశ్వాస్ ల ఖాతాల్లో సెప్టెంబర్ 15 న వరుసగా రూ .6,20,11,100, రూ .90,52,21,223 వచ్చి పడిన విషయం తెలిసిందే. ఇక రంజిత్ దాస్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ .5.5 లక్షలు రాగా, వాటిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more