TTD good news to backward area srivari devotees సర్వదర్శనం టోకెన్ల నిలిపివేసిన టీటీడీ.. భక్తుల ఆందోళన..

Tirumala tirupati devasthanam good news to backward area srivari devotees

Tirumala Tirupati Devasthanam, TTD, Sri Vari darshanam, Tirumala Darshanam, Lord Balaji darshan, sarva darshanam tokens, Lord Venkateshwara swamy darshanam, YV SubbaReddy, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, APTDC, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, SriVari dhana Prasadam, Dharma reddy, devotional

Tirumala Tirupati Devasthanams’ (TTD) executive officer (EO) Dr K S Jawahar Reddy said on Tuesday that the temple administration will facilitate darshan for at least 1,000 devotees from economically weaker sections during the annual Brahmotsavams that are slated to be held at Tirumala from October 7 to 15.

సర్వదర్శనం టోకెన్ల నిలిపివేసిన టీటీడీ.. తిరుమల శ్రీవారి భక్తుల ఆందోళన..

Posted: 09/24/2021 05:46 PM IST
Tirumala tirupati devasthanam good news to backward area srivari devotees

శ్రీవారి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు పెద్ద పీట వేస్తామని ప్రకటించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. పేదభక్తుల అందుబాటులోకి తీసుకువచ్చిన సర్వదర్శనం టోకెన్ల జారీని అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్న భక్తులు శ్రీనివాసం వద్ద అందోళనకు దిగారు. కరోనా మహమ్మారి విజృంభించి నేపథ్యంలో శ్రీవారి భక్తలకు స్వామివారి దర్శనం కల్పించడంలోనూ అంక్షలను తీసుకువచ్చిన టీటీడీ.. ఆ తరువాత నిన్నమొన్నటి వరకు కేవలం ప్రత్యేక దర్శన టికెట్లను మాత్రమే విక్రయించింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగడం గగనమైంది.

దీంతో తమకు తమ కొంగు బంగారమైన స్వామివారి దర్శనభాగ్యం కలగడం లేదంటూ ఎందరెందరో భక్తులు నిరాశ, నిసృహలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారి బాధను అర్థం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు .. సామాన్యులకు కూడా ద్వారాలు తెరిచింది. తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే అవకాశం కల్పించిన టీటీఢీ ఇవాళ్టి నుంచి సామాన్యభక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకోసం సర్వదర్శనం టోకన్ల సంఖ్యను రెండు నుంచి 8వేలకు పెంచుతున్నామని ప్రకటించింది. దీంతో ఇవాళ ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసం చేరుకున్నారు.

అయితే శ్రీనివాసం వసతిగృహానికి చేరుకున్న భక్తులకు నిరాశే ఎదురైంది. సర్వదర్శన టోకన్ల జారీని అధికారులు అకస్మాత్తుగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఖంగుతిన్న భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు ముందునుంచి ఓ ప్రకటన ఇచ్చి.. ఇప్పుడు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా అకస్మాత్తుగా టోకన్ల జారీని నిలిపేస్తున్నామని ప్రకటించడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే, టోకెన్లు ఇచ్చే వరకు వెనుదిరిగేది లేదని భక్తులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసం వసతి గృహం వద్ద భారీగా మోహరించారు. మరోవైపు, రేపటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles