శ్రీవారి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు పెద్ద పీట వేస్తామని ప్రకటించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. పేదభక్తుల అందుబాటులోకి తీసుకువచ్చిన సర్వదర్శనం టోకెన్ల జారీని అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్న భక్తులు శ్రీనివాసం వద్ద అందోళనకు దిగారు. కరోనా మహమ్మారి విజృంభించి నేపథ్యంలో శ్రీవారి భక్తలకు స్వామివారి దర్శనం కల్పించడంలోనూ అంక్షలను తీసుకువచ్చిన టీటీడీ.. ఆ తరువాత నిన్నమొన్నటి వరకు కేవలం ప్రత్యేక దర్శన టికెట్లను మాత్రమే విక్రయించింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగడం గగనమైంది.
దీంతో తమకు తమ కొంగు బంగారమైన స్వామివారి దర్శనభాగ్యం కలగడం లేదంటూ ఎందరెందరో భక్తులు నిరాశ, నిసృహలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారి బాధను అర్థం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు .. సామాన్యులకు కూడా ద్వారాలు తెరిచింది. తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే అవకాశం కల్పించిన టీటీఢీ ఇవాళ్టి నుంచి సామాన్యభక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకోసం సర్వదర్శనం టోకన్ల సంఖ్యను రెండు నుంచి 8వేలకు పెంచుతున్నామని ప్రకటించింది. దీంతో ఇవాళ ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసం చేరుకున్నారు.
అయితే శ్రీనివాసం వసతిగృహానికి చేరుకున్న భక్తులకు నిరాశే ఎదురైంది. సర్వదర్శన టోకన్ల జారీని అధికారులు అకస్మాత్తుగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఖంగుతిన్న భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు ముందునుంచి ఓ ప్రకటన ఇచ్చి.. ఇప్పుడు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా అకస్మాత్తుగా టోకన్ల జారీని నిలిపేస్తున్నామని ప్రకటించడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే, టోకెన్లు ఇచ్చే వరకు వెనుదిరిగేది లేదని భక్తులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసం వసతి గృహం వద్ద భారీగా మోహరించారు. మరోవైపు, రేపటి నుంచి ఆన్లైన్లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more