తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ ముఖ్యనేతల వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో సింగిల్ హీరో భావజాలం కుదరదని ఆయన తేల్చిచెప్పారు. ఈ తరహా వ్యవహారశైలితో పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఒక్కరిని స్టార్ గా మార్చే క్రమంలో మిగతావారిని తోక్కేయడం సముచితం కాదని ఆయన సూచించారు. సింగిల్ హీరో భావజాలం చూపించడానికి ఇది కాంగ్రస్ పార్టీ అని.. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాదని ఆయన చురకలంటించారు.
పార్టీ నేతలతో చర్చించకుండానే కార్యక్రమాలు ఖరారు చేసుకోవడం ఏంటని నిలదీశారు. ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేసుకుని ఆ తరువాత వాటిని పార్టీ నేతలతో చర్చించడంలో ఆంతర్యమేమిటని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరే తోపు అనుకుంటే పోరబాటని, ఎందరో తోపులు వున్నారని, ఆ విషయానికి వస్తే రేవంత్ కన్నా తానే పెద్ద తోపునని జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. నాకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి , రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు.
రేవంత్ రెడ్డి జహీరాబాద్ వస్తున్నట్లు తనకు సమాచారం లేదని జగ్గారెడ్డి అన్నారు. జహీరాబాద్ వస్తున్నట్లు కనీసం గీతారెడ్డికి కూడా సమాచారం లేదని, వ్యక్తిగత ప్రచారానికే ఆరాటపడితే పార్టీలో కుదరదని ఆయన అనడం గమనార్హం. సంగారెడ్డి జిల్లాకు వస్తున్నట్లు తనకు సమాచారం లేదని, విభేదాలు ఉన్నాయని చెప్పేందుకు సమాచారం ఇవ్వట్లేదా? అని ఆయన నిలదీశారు. పార్టీలో సింగిల్ హీరోగా ఉండాలనుకుంటే కుదరదని చెప్పారు. ఈ రాష్ట్రంలో తనకు అభిమానులున్నారని.. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2 లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more