కరోనా మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నాయ. అంతకంతకూ రూపాంతరం చెందుతున్న వైరస్ పలు చోట్ల పలు వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తొంది. ఎటు నుంచి ఏ రకమైన కరోనా తమను ప్రభావితం చేస్తోందోనని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చేసిన ఒక అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.
తొలిగా ప్రపంచంలో విజృంభించిన కరోనా వైరస్తో పోలిస్తే కొత్తగా వస్తున్న వేరియంట్లు గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఒరిజినల్ కరోనా సోకిన వారితో పోలిస్తే ఆల్ఫా వేరియంట్ సోకిన వారి ఊపిరి ద్వారా 43 నుంచి 100 రెట్లు అధికంగా వైరస్ క్రిములు గాల్లో ప్రవేశిస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు. డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోందంటే ఇది సోకిన వారి నుంచి గాల్లోకి మరింత ఎక్కువ వైరస్ చేరుతున్నట్లేనని అంటున్నారు. కరోనా పేషెంట్లు వదులుగా ఉండే మాస్కులు, సర్జికల్ మాస్కులు ధరించడం వల్ల వారి నిశ్వాసలో ఉండే కరోనా క్రిముల్లో 50 శాతం మాత్రాన్ని అవి నిరోధిస్తున్నాయని పరిశోధకులు చెప్పారు.
కరోనా సోకిన వారు టైట్గా ఉండే మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తిని మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు ఇలా మాస్కులు ధరించడం, ఇళ్లలో వెంటిలేషన్ సదుపాయం సక్రమంగా ఉండేలా చూసుకోవడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని అన్నారు. ”గాలి ద్వారా సంక్రమించేలా కరోనా రూపాంతరం చెందుతోంది. కొత్త వేరియంట్లు క్రమంగా గాలి ద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. అందువల్ల గదుల్లో వెంటిలేషన్ బాగుండాలి. ముఖానికి సరిగా అమరే మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వీటితో పాటు వాకీన్లను తీసుకుంటూ కరోనా నుంచి రక్షణ పోందవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ 2వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్ తో అంతకంతకూ మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్గా తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more