TTD Board to send good news to Tirumala SriVari Devotees తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Good news to tirumala sri vari devotees ttd to issues free darshan online soon

TTD, Srivari darshan free tickets Online, free darshan tickets online, Sarva darshanam tickets online, free darshan tickets online, Sarva darshanam free tickets online, Tirumala Tirupati, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Andhra pradesh, politics

Tirumala Tirupati Devasthanam Board sends good news to Tirumala SriVari ordinary Devotees, by issuing free darshan (sarva darshanam) Tickets Online soon. The free tickets quota is double the supatham tickets issued daily. TTD said it will extends the tickets following covid protocol.

తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Posted: 09/14/2021 11:10 AM IST
Good news to tirumala sri vari devotees ttd to issues free darshan online soon

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పనుంది. గత కొన్ని నెలలుగా ఏడుకొండలు ఎక్కినా శ్రీవారి దర్శనభాగ్యం కలగని భక్తులకు ఇకపై కాసింత ఊరట లభించనుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభించిన టీటీడీ.. ఇకపై ప్రత్యేక దర్శనంతో పాటు సర్వదర్శన టోక్లన్లను కూడా ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధమవుతోంది.

త్వరలో ఆన్ లైన్ లోనూ సర్వదర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. దీనిపై చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఎక్కువ మందికి శ్రీవారి సర్వదర్శనం కల్పించాలని కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారంలోపు సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామన్నారు. టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని.. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది.

సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. కరోనా నిబంధనలు అనుసరిస్తూ రోజుకు 2 వేల టోకన్లు మాత్రమే జారీ చేస్తున్న టీటీడీ.. క్రమంగా స్వామివారి భక్తులందరికీ సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య దృష్ట్యా ఉంచుకుని తిరుమలలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటి వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ విషయంలో భక్తులు, హిందూ ధార్మిక సంఘాల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles