వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతుల విగ్రహాల నిమజ్జన విషయమై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తిరస్కరించింది. నిమజ్జన ఏర్పాట్లు విషయంలో గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు గతేడాది జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు పాటించలేదని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు పాటించకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపింది.
కాలుష్యాన్ని నియంత్రించాల్సిన జీహెచ్ఎంసీ.. అనుమతి కోరుతూ రివ్యూ పిటీషన్ దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. గణేష్ నిమ్మజ్జనంపై ఏ ఒక్క మినహాయింపు కూడా ఇవ్వలేమని, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలతో ట్యాంకుబండ్ కాలుష్యకాసారంగా మారుతుందని ఇప్పటికే ప్రజాసంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని మర్చిపోయారా.? అని న్యాయస్థానం జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిస్థితి కుడిదిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది.
కాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్ లో జీహెచ్ఎంసీ పేర్కొంది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్ సాగర్లో రబ్బర్ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ తన పిటీషన్లో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more