ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఐకియా స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ఆయన బైక్ అదుపుతప్పింది. దీంతో ఆయన బైక్ పైనుంచి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి గురికాగానే.. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని మెగా హీరోను ఆస్పత్రికి తరలించారు. షాక్ తో అపస్మారక స్థితిలోకి జారుకున్న ధరమ్ తేజ్ను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు.
అయితే మెడికవర్ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స తరువాత సృహలోకి వచ్చిన ధరమ్ తేజ్ ను అపోలో అసుపత్రకి తరలించారు. ప్రస్తుతం మెగాహీరోకు అపోలోలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తూ.. ఆయన అరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ధరమ్ తేజకు ప్రమాదం జరిగిందన్న వార్తను తెలియగానే మెడికవర్ అసుపత్రికి మెగాస్టార్ చిరంజీవి, హీరో వరుణ్ తేజ్, జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, సహా పలువురు మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు సినీఅగ్రనిర్మాత అల్లు అరవింద్ కూడా చేరుకుని ధరమ్ తేజ్ అరోగ్యం విషయమై అసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ సేఫ్గా ఉన్నట్లు టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సాయి ధరమ్కు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు. అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు. తాను డాక్టర్లతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సాయి ధరమ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం చికిత్సను అందిస్తున్నదని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more