YCP Leader threatens contractor in rayadurgam కాంట్రాక్టరుపై వైసీపీ ఎమ్మెల్యే స్నిహితుడి వీరంగం..

Ycp leader jayarama reddy threatens contractor in rayadurgam

YCP MLA Kapu Ramachandra Reddy, Raidurgam, YCP MLA Kapu Ramachandra Reddy Relative JayaramiReddy, Jayarami Reddy, Raidurgam, Contractor, Kanekal Road, JayaramiReddy Rowdyism, kapu ramachandra reddy, Kapu Ramachandra Reddy, MLA Kapu Ramachandra Reddy, YCP MLA, YSR Congress, Ananthapur, Andhra Pradesh, Politics, Crime

Ruling YSR congress party senior leader and relative of party Whip Kapu Ramachandra Reddy, Jayarama Reddy threatens Contractor staff, warns of Physical attack on staff, if they ignore his warnings.

ITEMVIDEOS: కాంట్రాక్టరుపై వైసీపీ ఎమ్మెల్యే సన్నిహితుడి వీరంగం.. బౌతికదాడులేనని హెచ్చరిక.!

Posted: 09/06/2021 12:45 PM IST
Ycp leader jayarama reddy threatens contractor in rayadurgam

రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత జయరామరెడ్డి ఓ కాంట్రాక్టర్ ను రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంట్రాక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఆయన తన కారులోనే కూర్చోని.. కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. తాము చె్ప్పినట్టు నడుచుకోకపోతే బౌతికదాడులు తప్పవని హెచ్చరించడంతో పాటు.. యంత్రాలను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

అవినీతి లేని పాలనను అందిస్తామని ఓ వైపు వైఎస్సార ఫార్టీ అధినేత జగన్ అధికారంలోకి రాకముందు చేసిన ప్రకటనకు.. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు చేస్తున్న హెచ్చరికలకు మధ్య అస్సలు పోంతనలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేసింది. ద్వారకామాయి కన్స్ ట్రక్ క్షన్స్ (డీఎంసీ) అనే సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది.

విషయం తెలిసిన జయరామరెడ్డి కాంట్రాక్టర్ సిబ్బందిని కలసి టెండర్ వేసిన తరువాత కతలసి సర్ధుకుపోదాం అని చెప్పిన కాంట్రాక్టర్.. చెప్పకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని కాంట్రాక్టర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తనను మాట్లాడుకొమ్మన్నారని.. తనతో మాట్లాడకుండా, తనకు తెలియకుండా పనులు ఎలా చేస్తారన్నారు. తమ మనుషులు వస్తున్నారని... ఒక్క సైగ చేస్తే మొత్తం పగులగొట్టి పోతారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles