తెలంగాణలో హీట్ ఎక్కిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలను పండుగల సీజన్ ముగిసిన తర్వాతనే నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి. పండుగల సీజన్ తర్వాతే తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు మరో 12 ఇతర రాష్ట్రాలు కూడా కరోనా మహమ్మారి ప్రభావం, భారీ వర్షాలు, వరదలు, పండుగల నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికల నిర్వహణ శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులను మన్నించి ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవ్వలేదు.
కానీ, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మాత్రం ఉపఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తంచేశాయి. తమ రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రధాన కార్యదర్శులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఉపఎన్నికలు నిర్వహించే నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఏమాత్రం లేదని, పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బెంగాల్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ బెంగాల్ లో మూడు శాసనసభ నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 30న ఉపఎన్నికలు జరిపి అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరుపనున్నారు.
ఈసీ షెడ్యూల్ ప్రకారం.. బెంగాల్లోని భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ నియోజకవర్గాలకు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 1న సీఎస్లతో సమావేశమైంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల సీఎస్లు ఎన్నికల నిర్వహణకు విముఖత వ్యక్తం చేశారని ఈసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు, పలువురు నిపుణులు మూడో దశ కరోనా ప్రభావంపై ఇప్పటికే చేసిన హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకున్నామని పేర్కొన్నది. కేంద్రం కూడా మూడో దశ కరోనా ప్రభావం గురించి రాష్ట్రాలకు పలు సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more