ఆన్ లైన్ గేమ్స్ ఆడే విషయంలో చైనా కఠిన నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు స్కూల్ నడిచే రోజుల్లో ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడటంపై నిషేధం విధించింది. వారాంతాలు లేదా సెలవు దినాల్లో మాత్రమే వీడియో గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించింది. అది కూడా రోజులో గంట సమయం మించకూడదన్న కఠిన నిబంధనలను చైనా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నియమాలు ఇవాల్టి నుంచే అమలులోకి రానున్నాయి. ఆన్లైన్ గేమ్స్తో విద్యార్థుల ఆరోగ్యంతోపాటు చదువు కూడా చెడిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. ఈ నిబంధనలు 18 ఏండ్లలోపు వయసున్న వారికి మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నది.
ఈ నిబంధనలతో చిన్నారులు వారాంతాల్లో మూడు గంటల కన్నా ఎక్కువ సమయం ఆన్లైన్ వీడియో గేమ్స్పై గడపడానికి ఇకపై వీలు లేదు. ఆన్లైన్ గేమ్స్లో బిజీగా ఉండటం వల్ల విలువైన చదువును, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేయడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత ఉత్తర్వుల ప్రకారం సాధారణ రోజుల్లో గంటన్నర పాటు వీడియో గేమ్స్ ఆడేందుకు అవకాశం ఇచ్చేవారు. అలాగే, వారాంతాల్లో రోజుకు మూడు గంటల చొప్పున అనుమతించేవారు. ఈ నియమాలు మరీ సరళంగా ఉన్నాయని పేరెంట్స్ ఫిర్యాదుతో ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
ఈ రూల్స్ ప్రకారం విద్యార్థులు శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు. చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలు ప్రపంచ గేమింగ్ మార్కెట్కు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. చైనాలో ఆన్లైన్ గేమింగ్లో లక్షలాది మంది యువకులు పాల్గొంటున్నారు. గేమ్ డెవలపర్లు చైనాను ఒక ముఖ్యమైన మార్కెట్గా భావిస్తారు. స్టాటిస్టా ప్రకారం, చైనా ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ విలువ రూ.4.27 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రభుత్వ కఠిన నిర్ణయం తర్వాత కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more