కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లు జరిపి అమాయక ప్రజలతో పాటు అమెరికా బలగాలను బలిగొన్న వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీచేసిన తరుణంలో తాము మాటలు చెప్పడమే కాదు.. చెప్పింది చేస్తామని కూడా అమెరికా చేసిచూపింది. తాలిబన్ల వశమైన అప్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. బాంబుదాడులతో విరుచుకుపడింది.
అప్ఘనిస్తాన్ లోని తమ ఇళ్లు-వాకిళ్లు వదిలి.. అస్తిపాస్తులు కాదనుకుని.. పిల్లాపాపలతో కలసి కట్టుబట్టలతో విదేశాలకు చేరుకునేందుకు కాబుల్ విమానాశ్రయానికి చేరిన అమాయక ప్రజలపై ఆత్మహుతి దాడులకు పాల్పడి ఏకంగా 200 మందిని బలిగొన్నవారిని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన విధంగానే వారిపై బాంబుదాడులు కురిపించారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా సైన్యానికి చెందిన పౌరులు కూడా వున్నారు. దీంతో వారిని బైడెన్ హీరోలుగా అభివర్ణించారు.
నాంగ్హార్ ప్రావిన్స్లో అమెరికా వాయుసేన ఈ మానవ రహిత వాయు దాడులకు దిగింది. లక్ష్యాన్ని ఛేదించినట్టు, పేలుళ్లకు సూత్రధారి హతమయ్యాడని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. ఈ దాడుల్లో పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు. కాగా, అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద అబే గేటు వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీరిని హెచ్చరించిన మరుసటి రోజే అమెరికా వాయుసేన ఈ దాడులకు పాల్పడడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more