ఎక్కడో విదేశాల్లో మాత్రమే కనిపించే వర్ణ విభేధాలకు ఇప్పుడు భారత్ కూడా వేదికగా నిలుస్తోంది. ఏకంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన వర్ణంతో అవమానించే చర్యలకు స్వయంగా కేంద్ర మంత్రి పూనుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇదివరకు కూడా ఓ కేంద్రమంత్రి ఇటువంటి తరహా వ్యాఖ్యలే ఉత్తర, దక్షిణ భారతావని ప్రజల మధ్య చిచ్చురగిల్చేలా వర్ణంతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీని సందర్శించిన ఆయన అక్కడే ఈ వివాదానికి తేరలేపారు.
విశ్వవిద్యాలయ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతు.. రవీంద్ర ఠాగూర్ నల్లగా ఉండటంతో తల్లి ఆయన్ని పట్టించుకునేవారు కాదని వివక్ష చూపేవారని..తల్లితో సహా ఆయన కుటుంబంలో అందరి నిరాదరణకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ఠాగూర్ నల్లగా ఉండటం వల్ల తల్లి ఆయన్ని ఎప్పుడూ కొడుకుగా ముద్దు చేయలేదని..తల్లే కాకుండా ఆయన బంధువులు కూడా ఆయన్ని పట్టించుకునేవారు కాదని నల్లగా ఉండటం వల్ల వివక్ష చూపారని అన్నారు. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన్ని చేతుల్లోకి తీసుకోలేదని ఆదరంగా ఒడిలో కూర్చోబెట్టుకోవటం వంటివి చేసేవారు కాదని అన్నారు.
తన కుటుంబంలోని మిగతా వారి కంటే ఠాగూర్ నల్లగా ఉండేవారు. పసుపు రంగులో మెరిసిపోయేవారు కొందరుంటే..ఇంకొందరు ముదురు రంగులో ఉండేవారు.. విశ్వకవి రెండో వర్గానికి చెందినవారు. అని అన్నారు. విశ్వకవిగా పేరొందిని రవీంద్రుడు కుటుంబంలోనే వివక్షను ఎదుర్కొన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మేధావులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాజకీయంగానూ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖ మంత్రి అజ్ఞానానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. భారతీ సాహిత్యానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన రవీంద్రుడి రంగుపై ఇటువంటి వ్యాఖ్యలు విద్యాశాఖామంత్రి బాధ్యతల్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటంపై మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more