హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా వార్తల్లో వ్యక్తిగా మారారు. అదేంటి.. అంటారా.. రాజకీయాల్లో నిత్యం బిజీగా వుంటే ఆయన ఓ పరీక్ష కోసం అహర్నిషలు కష్టపడి.. రాయడంతో ఆయన వార్తలోని వ్యక్తిగా మారారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నగరా మోగనుందని.. ఈ తరుణంలో ఆయన రాజీకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోనడానికి పరీక్షలను ఎదుర్కోంటున్నారని భావిస్తున్నారా..? తన పార్టీని ఈ సారి అధికారంలోకి తీసుకురావడమే ఆయన ముందున్న తక్షణ పరీక్ష అనుకుంటున్నారా..? అయితే అది పోరబాటే.
ఎందుకంటే ఆయన తన పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్లో బుధవారం ఆయన ఈ పరీక్ష రాశారు. 86 ఏళ్ల చౌతాలా గతంలో జేబీటీ రిక్రూట్మెంట్ కుంభకోణంలో దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. తన జైలు జీవితాన్ని ఆయన మెట్రిక్యులేషన్ చదువు కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఆ కోర్సులో ఇంగ్లిష్ పరీక్ష మిస్సయ్యారు. దానినే ఇప్పుడు ఆయన రాసి ఉత్తీర్ణులవ్వాలని భావించారు. అందుకోసం ఇటీవల ధరఖాస్తు చేసుకుని ఇప్పుడు పరీక్ష రాశారు.
మాజీ సీఎం చేతికి గాయమైందని, కాబట్టి ఆయనకు పరీక్ష రాయడం కోసం సహాయకుడిని అనుమతించామని బీఎస్ఈహెచ్ సెక్రటరీ హితేందర్ కుమార్ తెలిపారు. ఆమధ్య భివానీ ఎడ్యుకేషనల్ బోర్డులో ఓపెన్ ఎగ్జామినేషన్ సిస్టంలో 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఈ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే చౌతాలా మెట్రిక్యులేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయన ఫలితాన్ని బోర్డు విడుదల చేయలేదు. దీంతో దానిని పూర్తి చేయడం కోసం ఆయన ఇప్పుడు ఇంగ్లిష్ పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రం వద్ద మీడియా ప్రశ్నలకు చౌతాలా ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more