సైబర్ హ్యాకర్లు భరితెగించిపోయారు. ఏకంగా భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేసి నకిలీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు నెలల వ్యవధిలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. దీని బట్టి ఎన్నికల కమీషన్ అధికారులు ఎంతటి మొద్దు నిద్రలో వున్నారో ఇట్టే అర్థం అవుతోంది. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నా.. ఇటీవల గుర్తించి.. పోలీసులకు పిర్యాదు చేయడంతో గుట్టు రట్టు అయ్యింది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు, ఓటర్ల జాబితా.. వారి ఓటర్ ఐడీ కార్డులతో పాటు ఇతరత్రా కీలక సమాచారం నిక్షిప్తం అయ్యిఉంటుంది. అయితే..ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేశాడని అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్ చేసింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాసిగా గుర్తించి.. విపుల్ సైని (24) యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఈ యువకుడు దాదాపు పది వేలకు పైగా నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేసినట్లు గుర్తించారు.
ఇతను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)..డిగ్రీ కలిగిన ఇతను మూడు నెలల్లో 10 వేల ఫేక్ ఐడీలను క్రియేట్ చేశారని తేలింది. ఇలా చేయడానికి కారణమేంటని విచారించిన పోలీసులకు మధ్యప్రదేశ్ లోని మెరినాకు చెందిన హరిఓం సింగ్ అనే వ్యక్తి కోసమే తాను ఈ పని చేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో హరిఓం సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారించగా.. తాను అర్మన్ మాలిక్ అనే వ్యక్తికి ఈ పనులు చేయించినట్లు చెప్పడని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు.
మధ్యప్రదేశ్ పోలీసులు సైనీతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఓ దినసరి కూలి కొడుకైన 18 ఏళ్ల టీనేజర్ హరీఓం సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో ఈ వ్యవహారం విషయమై క్లోజ్ గా మెలిగిన మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, విపుల్ సైని ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100 నుంచి రూ. 200 చొప్పున విపుల్ తీసుకున్నాడని, అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 60 లక్షలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ వైబ్ సైట్ హ్యాక్ కాలేదని, తమ వద్ద నిక్షిప్తమైన వున్న డాటా బేస్ పూర్తిగా సురక్షితంగా వుందని ఈసీ అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more