తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తన గురించి అసత్య ప్రచారాలు చెప్పి హుజూరాబాద్ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని హరీశ్ రావు చేస్తున్నారని మండిపడ్డారు. తన మామ కేసీఆర్ మెప్పు పొందేందుకే హరీశ్ రావు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావు మోసపు మాటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మె అస్కారమే లేదని అన్నారు. ఎన్నికల కోసమే కొత్త డ్రామాలు వేస్తున్న టీఆర్ఎస్ నేతలు.. అంతకుముందు ఏం చేశారో.. ఎన్నికలు పూర్తైన తరువాత ఎన్ని సార్లు ఏ నాయకులు వస్తారో కూడా ఇక్కడి ప్రజలు అర్థం చేసుకోగలరని ఆయన దుయ్యబట్టారు.
హుజూరాబాద్ ప్రజల ప్రేమను పొంది, వరుసగా గెలుస్తున్న వ్యక్తిని తానని చెప్పారు. టీఆర్ఎస్ అబ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు రెండు గుంటల భూమి ఉందని.. కొత్త పంథాను ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ సహా హరీశ్ రావుకు దిమ్మదిరిగే సవాల్ ఇచ్చారు. రాజకీయాల్లోకి తాను చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. అదే విధంగా 2001లో హరీశ్ రావుకు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై న్యాయ విచారణ.. సిబీఐ దర్యాప్తుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్ లో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
హరీశ్ రావు అనవసర విమర్శలు చేసి పలుచన కావొద్దని ఈటల సూచించారు. సిద్దిపేటలో హరీశ్ వరుస విజయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ కేసీఆర్ నియోజకవర్గంలో నిల్చోవడం వల్లే హరీశ్ వరుసగా గెలుస్తున్నడని ఈటల సాలిడ్ పంచ్ వేశారు. తాను హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించి గెలుస్తున్న అని అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన హరీశ్ కు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని... దుబ్బాక ఎన్నికలో కూడా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పిన హరీశ్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా హరీశ్ కు బుద్ధి చెపుతారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more